S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/18/2018 - 05:33

ఐక్యరాజ్యసమితి, జూలై 17: భూతాపం వేగంగా పెరిగి ప్రజా రోగ్యానికి ముప్పుగా తయారవుతోంది. ప్రపంచంలో భూతాపం విస్తరిస్తున్న మొదటి తొమ్మిది దేశాల్లోభారత్ ఒకటి. ఇక్కడ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, భూతాపాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు సమగ్రమైన చర్యలను వెంటనే తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి నివేదికలో పేర్కొంది. వాతావరణం చల్లబడేందుకు ప్రభుత్వాలు వెంటనే చర్యలకు ఉపక్రమించాలి.

07/18/2018 - 02:30

ఇస్లామాబాద్, జూలై 17: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కోర్టులో చుక్కెదురైంది. అవినీతిలో జైలు శిక్ష అనుభవిస్తున్న నవాజ్‌షరీఫ్, కుమార్తె మరియం, అల్లుడు తమకు విధించిన శిక్షను సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణను ఈ నెలాఖరుకు వరకు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. శిక్షలను సస్పెండ్ చేయాలన్న వినతిని హైకోర్టు తోసిపుచ్చింది.

07/18/2018 - 02:28

డెహ్రాడూన్, జూలై 17: అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై ఐదుగురు బాలురు అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన ఉత్తరాఖండ్‌లోని సాహస్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలురు అందరూ 9 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలే. ఈ దారుణానికి పాల్పడే ముందు వారు మొబైల్ ఫోన్‌లో వీడియో చూసినట్లు తెలుస్తోంది. జూలై 12న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

07/17/2018 - 02:10

అస్టోరియా (ఒరెగాన్), జూలై 16: భారత శరణార్థులు అమెరికా జైలులో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. చేతులకు సంకెళ్లతో, కదలికలపై ఆంక్షలతో ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. అక్రమంగా దేశంలోకి చొరబడ్డారని, స్వదేశానికి వెళ్లకుండా తిష్టవేశారని ఆరోపిస్తూ ఒరెగాన్ పోలీసులు అరెస్టు చేసిన యాభై మందికిపైగా భారతీయుల పరిస్థితి దారుణంగా ఉంది.

07/17/2018 - 02:04

కరాచీ, జూలై 16: నిలిచి ఉన్న బస్సుపైకి ఒక ట్రేలర్ ట్రక్కు దూసుకెళ్లిన సంఘటనలో 18 మంది మృతి చెందారు. సుమారు 30 మంది గాయపడ్డారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావీన్స్, హైదరాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది.

07/16/2018 - 02:22

ఇస్లామాబాద్, జూలై 15: పాకిస్తాన్‌లో ఎన్నికల నేపథ్యంలో గత పక్షం రోజుల్లో ఉగ్రవాదుల దాడిలో 150 మంది పౌరులు మరణించడంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో ప్రభుత్వం ఉందా? సైన్యం ఏమి చేస్తోంది? ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు సైన్యం వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటి? అనే అంశంపై చర్చ మొదలైంది. ఈ నెల 25న ఎన్నికలు జరగనున్న సందర్భంగా బలూచిస్తాన్, పెషావర్ ప్రాంతంలో తాలిబాన్ల దాడుల్లో 150మందికిపైగా మరణించారు.

07/16/2018 - 00:59

లాహోర్, జూలై 15: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఈ నెల 25వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ రంగంలోకి దిగింది. ఉగ్రవాద సంస్థలు ఫేస్‌బుక్ సేవలను వినియోగించుకోకుండా వారి అకౌంట్లను స్తంభింపచేసింది. ఇస్లామిస్ట్ మిల్లి ముస్లిం లీగ్ (ఎంఎంఎల్)కు చెందిన ఫేస్‌బుక్ అకౌంట్లను నిలిపివేస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది.

07/16/2018 - 00:57

ఢాకా, జూలై 15: భారత వ్యతిరేక కార్యకలాపాలు సాగించేందుకు తమ భూభాగంలో ఉగ్రవాదులను ఎట్టి పరిస్ధితుల్లోనూ అనుమతించేది లేదని బంగ్లాదేశ్ ఉద్ఘాటించింది.్భరత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం జరిపిన చర్చల సందర్భంగా బంగ్లాదేశ్ హోం మంత్రి అసాదుజ్జమాన్ ఖాన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వీరిద్దరి మధ్య ఇరుదేశాలకు సంబంధించిన భద్రతాపరమైన అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.

07/15/2018 - 02:05

రోమ్, జూలై 14: ఇటు ఇటలీ, అటు మాల్టా దేశాలు మొండి వైఖరిని అనుసరిస్తున్న నేపథ్యంలో, లిబియా నుంచి ఒక భారీ పడవలో బయలుదేరిన శరణార్థులు సముద్ర జలాల్లోనే చిక్కుకుపోయారు. ఈ రెండు దేశాలు తీసుకోబోయే నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నారు. సుమారు 450 మంది శరణార్థులతో కూడిన పడవను మాల్టా సముద్ర జలాల్లో ఇటలీ కోస్ట్‌గార్డ్ సిబ్బంది గుర్తించారు. ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించి, ఆ పడవను నిలిపేశారు.

07/15/2018 - 01:57

మాస్కో, జూలై 14: అవే కేరింతలు. ఆశ్చర్యపోయే కౌగిలింతలు. మాస్కో మైదానాల్లో స్పర్శకొచ్చిన అత్యద్భుత గుండె చప్పుళ్లివి. రష్యా గడ్డమీద నా దేశం జట్టుకు చోటుదక్కలేదన్న చిన్న అసంతృప్తి. దాన్ని మాయం చేస్తూ మాస్కో గుండెల్లో నా దేశానికి దక్కుతోన్న నులివెచ్చని స్పర్శ. ఇప్పటిదే కాకపోవచ్చు. మహాద్భుత సోవియట్ శకం నుంచీ ఆ స్పర్శ ఉండొచ్చు.

Pages