-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
టోక్యో, జూలై 1: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఇటీవల జరిగిన శిఖరాగ్ర సమావేశం పూర్తిగా విజయవంతమైన నేపథ్యంలో తమపై ఇంతవరకు విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చైనా నేత జిన్పింగ్కు విజ్ఞప్తి చేసినట్టు ఒక జపనీస్ పత్రిక వెల్లడించింది. గత నెలలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ జరిపిన సమావేశమైన సంగతి తెలిసిందే.
వాషింగ్టన్, జూన్ 30: ఎలాంటి భయాందోళనలు లేకుండా ధైర్యంగా విధులను నిర్వర్తించుకోవాలని జర్నలిస్టులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. భయానక దాడులు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మేరీలాండ్లో ఒక పత్రికా కార్యాలయంలోకి చొచ్చుకుపోయినన వ్యక్తి విచక్షణారహితంగా ఐదుగురిని కాల్చిచంపిన సంఘటనపై ట్రంప్ స్పందిస్తూ, దానిని అత్యంత దారుణమై సంఘటనగా అభివర్ణించారు.
పోర్ట్లాండ్: డొనాల్డ్ ట్రంప్ సర్కారు అనుసరిస్తున్న ఇమ్మిగ్రేషన్ విధానం అమెరికాలో తీవ్ర దుమారం రేపుతున్నది. ప్రత్యేకించి అమెరికా-మెక్సికో సరిహద్దులో వందలాది మంది పిల్లలను నిర్బంధించి, వారివారి తల్లిదండ్రుల నుంచి వేరు చేసిన విధానాన్ని ప్రజలు ఎండగడుతున్నారు. శనివారం అమెరికాలోని పలు నగరాల్లో ట్రంప్ ఇమ్మిగ్రేషన్ తీరును వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీలు జరిగాయి.
వాషింగ్టన్, జూన్ 30: మీరు ఎంత తెలివైన వారో తెలుసుకోవాలంటే మీకు వివిధ రాతపరీక్షలు, వౌఖిక పరీక్షలు పెట్టి మీ సామర్థ్యం తెలుసుకోనక్కర్లేదు. మీ తెలివితేటల శాతమెంతో తెలుసుకోవాలంటే మీ మెదడును ఒక్కసారి పరీక్ష చేస్తే చాలు నిమిషంలో మీగురించి అంచనా వేయవచ్చు. అమెరికాకు చెందిన కొందరు శాస్తవ్రేత్తలు కృత్రిమ మెధో విధానాన్ని అభివృద్ధి చేసి ఒక కొత్త పరికరాన్ని కనుగొన్నారు.
పారిస్, జూన్ 30: మనిషి జీవనశైలిలో వచ్చే మార్పులే మధుమేహం(డయాబిటిక్) వస్తుందని ఇప్పటి వరకూ భావిస్తూ వచ్చాం. వైద్యులూ అదే చెబుతూ వచ్చారు. అయితే వాయు కాలుష్యం కూడా మధుమేహం రావడానికి కారణమవుతోందని శాస్తవ్రేత్తలు వెల్లడించారు. 2016లో మధుమేహం వచ్చిన వారిని పరిశీలిస్తే ప్రతి ఏడుమందిలో ఒకరికి వాయుకాలుష్యంవల్లే వ్యాధి సంక్రమించినట్టు తేలింది.
లండన్, జూన్ 29: అత్యంత నైపుణ్యం గల వందలాది మంది భారతీయులు సహా పలుదేశాలకు చెందిన వారు దేశంలో నివసించే హక్కులను నిరాకరిస్తూ యూకె ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని ఆ దేశం సమర్థించుకుంది.
వాషింగ్టన్, జూన్ 29: అమెరికా మీడియా చరిత్రలో విషాదం చోటు చేసుకుంది. మీడియాపై అకారణ ద్వేషం పెంచుకున్న ఒక యువకుడు ఆధునిక ఆయుధాలతో కాపిటల్ గెజిట్ పత్రికాఫీసులోకి చొరబడి జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. షాట్గన్, స్మోక్ గ్రెనేడ్లతో సాయుధ యువకుడు దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.
న్యూయార్క్, జూన్ 28: భారత్లో మహిళలకు ఎలాంటి రక్షణాలేదంటూ ఓ సర్వేలో పేర్కొనడంపై కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ తీవ్ర ఆక్షేపణ తెలిపారు. థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ సర్వేలో భారత్లో మహిళలకు భద్రత లేదని నివేదించింది. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా ప్రపంచంలోనే భారత్ ముందుందని సర్వే పేర్కొంది.
ఐక్యరాజ్యసమితి, జూన్ 28: అభం శుభం తెలియని చిన్నారులను చేరదీసి వారిని ఆత్మహుతి దాడులకు ఉపయోగించుకునే నీచానికి ఉగ్రవాదులు దిగజారుతున్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాదులు విధ్వంసానికి, మారణహోమానికి పాల్పడేందుకు బాలలను రక్షణ కవచంగా ఉపయోగించుకుంటున్నారు. వారికి ప్రమాదకరమైన శిక్షణ ఇస్తున్నారు. వారిని ఆత్మహుతిదాడులకు పాల్పడే విధంగా ప్రేరేపిస్తున్నారు.
వాషింగ్టన్: ఇమ్మిగ్రేషన్ విధానంలో కొత్త సంస్కరణలు తేవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్కు రిపబ్లికన్లు ఆధిపత్యం ఉన్న చట్టసభ గట్టి షాక్ ఇచ్చింది. సొంత పార్టీ తీరుతో ట్రంప్ ఖంగుతిన్నారు. మెరిట్ ప్రాతిపదికన ఇమ్మిగ్రేషన్ పద్ధతి ద్వారా గ్రీన్ కార్డుల కోటాను తగ్గించాలన్న కొత్త విధానాన్ని అమలు చేయాలనే బిల్లును ట్రంప్ ప్రభుత్వం యునైటెడ్ స్టేట్స్ హౌస్లో ప్రవేశపెట్టింది.