S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/29/2018 - 01:21

బీరుట్, జూన్ 28: సిరియాలోని దక్షిణ ప్రాంతంలో తిరుగుబాటుదార్ల శిబిరాలపై రష్యన్ విమానాలు బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 22 మంది పౌరులు మరణించారు. ఆల్ సిఫ్రా పట్టణంపై రష్యా యుద్ధ విమానాలు 35 సార్లు దాడులు చేశాయని సిరియన్ మానవ హక్కుల నిఘా సంస్థ పేర్కొంది. ఒకచోట శిబిరంలో తలదాచుకుంటున్న 17 మంది ఈ దాడుల్లో మరణించారు.

06/29/2018 - 01:04

ఇస్లామాబాద్, జూన్ 28: ఇద్దరు పాకిస్తాన్ మాజీ ప్రధానులకు సొంతంగా కార్లు కూడా లేవట! కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా, కారు మాత్రం తమకు లేదని మాజీ ప్రధానులు యూసుఫ్ రజా గిలానీ, జఫారుల్లా ఖాన్ జమాలీ తమ అఫిడవిట్లలో పేర్కోవడం విచిత్రం.

06/29/2018 - 01:02

సింగపూర్, జూన్ 28: దేశంలో అంటువ్యాధులు సోకకుండా చేసేందుకు సింగపూర్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా తగిన వాక్సినేషన్ తీసుకోని టూరిస్టులను తమ దేశం నుంచి వెనక్కి పంపించివేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 5.6 మిలియన్ల జనాభా కలిగిన ఈ దేశాన్ని గత ఏడాది 17.4 మిలియన్ల మంది విదేశీయులు సందర్శించినట్లు లెక్కలు చెబుతున్నాయి.

06/28/2018 - 04:55

బీజింగ్, జూన్ 27: అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ ముదురుతున్న సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ కలవడం అంతర్జాతీయ దౌత్య, రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. నెల రోజులుగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. తమ దిగుమతులపై సుంకాలను అమెరికా పెంచినందుకు నిరసనగా చైనా ప్రతీకార చర్యలు తీసుకుంది.

06/28/2018 - 04:54

ఖుంతి (జార్ఖండ్), జూన్ 26: కిడ్నాప్ అయిన ముగ్గురు పోలీసుల కానిస్టేబుళ్ల కోసం చేపట్టిన తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ విధులకు ఆటంకం కల్పిస్తున్న గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఖుంతి జిల్లాలోని ఘాఘ్రా గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పాతాళ్‌గ్రహీ అనే సంస్థ మద్దతుదారులు బీజేపీ ఎంపీ కరియా ముండా నివాసం వద్ద నుంచి ముగ్గురు కానిస్టేబుళ్లను కిడ్నాప్ చేశారు.

06/27/2018 - 04:13

కాఠ్మండూ, జూన్ 26: భారత్, చైనాలతో సుహృద్భావ సంబంధాలు కొనసాగించాలనే నేపాల్ కోరుకుంటున్నదని ఆ దేశ ప్రధాని కె.పి. శర్మ ఓలి పేర్కొన్నారు. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాలకోసం ఇరుగుపొరుగు దేశాలతో రాజకీయ క్రీడలు నెరపడంపై తమకు ఎంతమాత్రం విశ్వాసం లేదని మంగళవారం పార్లమెంట్‌కు తెలిపారు. ఇటీవల తాను చైనాలో జరిపిన ఆరురోజుల పర్యటన వివరాలను ఆయన పార్లమెంట్‌కు వివరించారు.

06/27/2018 - 04:19

లండన్, జూన్ 26: మహిళలకు భారత్ అత్యంత ప్రమాదకర దేశమని థామ్సన్ రాయ్‌టర్స్ ఫౌండేషన్ సర్వే పేర్కొంది. భారత్‌లో మహిళలపై లైంగిక హింస అత్యధికమని పేర్కొంది. ఇదే విషయంలో తర్వాతి స్థానాలను వరుసగా ఆఫ్ఘనిస్తాన్, సిరియాలు ఆక్రమించాయి. సోమాలియా, సౌదీ అరేబీయాలు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.

06/26/2018 - 01:26

టొరొంటో, జూన్ 25: వీసాల జారీ ప్రక్రియలో కెనడా ప్రభుత్వం చేసిన మార్పులు భారత్ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. వీసాలు త్వరితగతిన మంజూరు చేయడంతోపాటు పలు మార్పులు ప్రభుత్వం తీసుకొచ్చింది. అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీసాల జారీలో తీసుకున్న నిర్ణయం భారత్‌కు తీవ్ర నిరాశకలిగించింది. 4టైర్ వీసాల మంజూరు జాబితాలో భారత్‌ను చేర్చకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

06/26/2018 - 01:03

వాషింగ్టన్, జూన్ 25: ‘దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని తక్షణమే గెంటేస్తాం. ఈ విషయంలో కోర్టుల్లేవ్.. కేసుల్లేవ్.. కేవలం చర్యలే. మా దేశంపైకి దండెత్తేవారిని ఉపేక్షించి ఊరుకోం ’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

06/24/2018 - 05:37

బ్రస్సెల్స్, జూన్ 23: ఈ నెల 28, 29 తేదీల్లో ఐరోపా యూనియన్ దేశాల సదస్సు బ్రస్సెల్స్‌లో జరుగుతున్న నేపథ్యంలో ఈ దేశాల్లోకి వచ్చే శరణార్ధుల సమస్యను పరిష్కరించే విషయమై యూనియన్ దేశాల ప్రతినిధులు ఒక ప్రణాళికను ఖరారు చేయనున్నారు. శరణార్థులు మెరుగైన జీవితం కోసం ఐరోపా దేశాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కాని దీని వల్ల ఈ దేశాల్లో రాజకీయ సంక్షోభం తలెత్తుతోంది.

Pages