S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

05/31/2018 - 05:15

జకార్తా, మే 30: ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేసియా పౌరులకు 30 రోజుల పాటు ఉచిత వీసా సదుపాయం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. తమ మూల దేశమైన భారత్‌లో పర్యటించి ‘సరికొత్త భారత్’లో అద్భుతమైన అనుభవాలను సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

05/30/2018 - 03:17

జకర్తా, మే 29: భారత్, ఇండోనేషియాలు ప్రాచీన నాగరికత, బహుళ సంస్కృతులు కలిగి ఉన్న దేశాలని, ఈ నాగరికతల మధ్య లోతైన, అవినాభావ సంబంధాలున్నాయని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తూర్పు ఆసియాలో మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం ఇక్కడకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు.

05/30/2018 - 03:13

కన్‌బెర్రా, మే 29: హిందూ మహా సముద్రం మీదుగా ప్రయాణిస్తూ అదృశ్యమై సముద్ర జలాల్లో పడిపోయినట్లు భావిస్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం 370కు చెందిన శకలాలను ఏదో ఒక రోజు కనుగొని తీరుతామని ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇప్పటికి మాత్రం విమానం ఆచూకీ కోసం చేస్తున్న ప్రయత్నాలు నిలుపుదల చేసినా, మిస్టరీని ఒకరోజు చేధిస్తామని ఆస్ట్రేలియా పేర్కొంది.

05/29/2018 - 02:32

న్యూఢిల్లీ, మే 28: వివాదాస్పదంగా మారిన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద మృతి కేసులో ఆమె పెట్టిన మెస్సేజ్‌లు, ఈ-మెయిళ్లను మరణ వాంగ్మూలంగా పరిగణించాలని పోలీసులు కోర్టును కోరారు. అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్న శశిథరూర్ భార్య సునంద 2014 జనవరి ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ‘నాకు బతకాలని లేదు.

05/29/2018 - 02:31

ఇస్లామాబాద్, మే 28: ఒకవైపు చర్చలంటూనే పాకిస్తాన్ కొత్త వివాదాలతో భారత్‌ను కవ్విస్తోంది. గిల్‌గిత్-బాల్టిస్తాన్ ప్రాంతం తమదేనని పేర్కొంటూ ఆ దేశం ఇటీవల తమ కేబినెట్‌లో తీర్మానం చేసింది. దీనిపై భారత్ మండిపడుతుండగా, ఈ అంశంపై భారత్ నిరసనలు తెలపడం సమంజసం కాదని పాక్ స్పష్టం చేసింది. జమ్మూకాశ్మీర్‌పై గతం నుంచి ఇప్పటివరకు వితండ వాదం చేస్తున్న భారత్ ఇప్పుడు ఈ విషయంపై నిరసన తెలపడమేమిటని ప్రశ్నించారు.

05/28/2018 - 03:21

వాషింగ్టన్: ఉత్తర కొరియా అధినేత కిమ్‌తో వచ్చే నెల 12న సింగపూర్‌లో జరపనున్న చర్చలు సాఫీగా, ప్రశాంతంగా సాగుతాయనే విశ్వాసం తనకు ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు. సింగపూర్‌లో జూన్ 12వ తేదీన కిమ్‌ను కలిసేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ చర్చలు చక్కగా జరుగుతాయి.

05/28/2018 - 03:22

కోక్స్ బజార్ (బంగ్లాదేశ్): గత తొమ్మిది మాసాలుగా మయన్మార్ నుంచి పారిపోయి వచ్చి కోక్స్ బజార్ జిల్లాలో శరణార్థులుగా ఉంటున్న ఏడు లక్షలమంది రోహింగ్యా ముస్లింలకు వచ్చే వర్షాకాలం పెనుముప్పుగా మారనుంది. మయన్మార్ నుంచి బలవంతంగా వెలివేతకు గురైన వీరు, ఇప్పుడు ప్రకృతి ప్రకోపాన్ని చవిచూసే పరిస్థితి ఏర్పడింది.

05/27/2018 - 06:18

సెయింట్ పీటర్స్‌బర్గ్, మే 26: అమెరికాతో సంబంధాలు క్రమేపి దెబ్బతినడం పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదమీర్ పుతిన్ విచారం వ్యక్తం చేశారు. అమెరికాతో మె రుగైన సంబంధాలు ఉండాలని మొదటి నుంచి రష్యా కోరుకుంటోందని, కాని దురదృష్టవశాత్తు అమెరికా తనకు తాను సృష్టించుకున్న వివాదాల్లో చిక్కుకుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ న్యూస్ ఏజన్సీల ఎడిటర్స్ సమావేశంలో పుతిన్ పై వ్యాఖ్యలు చేశారు.

05/27/2018 - 06:16

ఇస్లామాబాద్, మే 26: పాక్, భారత్ మధ్య శాంతిచర్చలు జరపడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏమీ లాయర్ కాదని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (74) వ్యాఖ్యానించారు. పలు ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది నుంచి దుబాయ్‌లో ఉంటూ వైద్య చికిత్స నిమిత్తం పాక్ వచ్చిన ఆయన ‘వాయిస్ ఆఫ్ అమెరికా’తో మాట్లాడారు. తాను పాక్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరు దేశాల సంబంధాలు సర్దుబాటు మార్గంలో ఉండేవన్నారు.

05/27/2018 - 05:46

లండన్, మే 26: ఐర్లాండ్‌లో అబార్షన్ (గర్భ విచ్ఛిత్తి) నిషేధిత చట్టాలను రద్దు చేయాలని ప్రజలు రెఫరెండమ్‌లో తేల్చి చెప్పారు. ఐర్లాండ్‌లో అబార్షన్ నిషేధిత చట్టాలు కఠినంగా ఉన్నాయి. ఈ అంశంపై ఐర్లాండ్ ప్రభుత్వం నిర్వహించిన రెఫరెండమ్‌లో 68 శాతం మంది ప్రజలు అబార్షన్ నిషేధిత చట్టాలను రద్దు చేయాలని ఓటు వేశారు. ఇది చారిత్రాత్మక విజయమని భారత సంతతికి చెందిన ఐర్లాండ్ ప్రధానమంత్రి లియో వరడ్కర్ ప్రకటించారు.

Pages