-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
కాబూల్, ఏప్రిల్ 22: అఫ్గానిస్తాన్లో ఇస్లామిక్ మిలిటెంట్లు మరోసారి రక్తపాతం సృష్టించారు. రాజధాని కాబూల్లో ఆదివారం ఓ రిజిస్ట్రేషన్ కేంద్రం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడి 48మంది ప్రాణాలు బలిగొన్నారు. మరో 112మంది దాడిలో క్షతగాత్రులయ్యారు. అఫ్గాన్లో ఎన్నికల సన్నాహక ప్రయత్నాల్లో భాగంగా ఓటరు నమోదు జరుగుతున్న సమయంలో దాడి జరిగింది.
బీజింగ్, ఏప్రిల్ 22: భారత్, చైనాల మధ్య వివాదాలకు తెరదించి మరింతగా సామరస్యాన్ని, సాన్నిహిత్యాన్ని పెంపొందించేందుకు మరో గట్టి ప్రయత్నం జరుగుతోంది. ఇందులో భాగంగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 27, 28 తేదీల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో శిఖరాగ్ర చర్చలు జరపనున్నారు.
బెర్లిన్: భారత్- జర్మనీ ద్వైపాక్షిక సం బంధాలకు సం బంధిం చి చాన్స్లర్ ఏంజె లా మెర్కల్తో వివి ధ అం శాలపై సం తృప్తికరమైన చర్చ లు సాగించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇరుపక్షాల చర్చల్లో ప్రపంచ సమస్యలు సైతం చోటుచేసుకున్నాయని ఒక ట్వీట్లో పేర్కొన్నారు.
వాషింగ్టన్, ఏప్రిల్ 21: భారతదేశంలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే మీడి యా సంస్థలపై ఒత్తిడి పెరుగుతోందని, వేధింపులు ఎక్కువవుతున్నాయని అమెరి కా విదేశాంగ విభాగం మానవ హక్కులకు సంబంధించి తాజాగా రూపొందించిన నివేదికలో స్పష్టం చేసింది.
తిరుపతి, ఏప్రిల్ 21: తిరుపతిలోని కెనె్సస్ హోటల్లో బస చేసిన స్వీడన్ దేశానికి చెందిన హెడెలాండ్ రోల్ఫ్ ల్యాంపర్ట్ విల్లే (58) శనివారం మృతి చెంది ఉండడాన్ని హోటల్ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాళహస్తి లోని గ్రీన్ప్లై సంస్థకు అవసరమైన యంత్రాలను అమర్చడానికి స్వీడన్ దేశం నుంచి 10 మంది బృందం శుక్రవారం తిరుపతికి చేరుకుంది.
అబుదాబిలోని అల్-మిర్ఫా సముద్ర తీరం శనివారం నిర్వహించిన సెయంగ్ పోటీల్లో పాల్గొన్న పడవలతో కొత్త అందాలను సంతరించుకుంది.
సియోల్లో శనివారం తైక్వాండో మార్షల్ ఆర్ట్స్లో
10వేల మంది పిల్లలు తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించే అవకాశం ఉంది.
సియోల్, ఏప్రిల్ 21: అణ్వాయుధ పరీక్షలతో ప్రపంచ దేశాలను గడగడలాడించిన ఉత్తర కొరి యా శనివారం సంచలన ప్రకటన చేసింది. అణ్వాయుధ, మీడియం రేంజ్, ఖండాంతర క్షిపణి పరీక్షలు ఇకపై నిర్వహించబోమంటూ ప్రకటించి సంచలనం రెకెత్తించింది. ఉత్తర కొరియా ప్రకటన వెలువడిన నిమిషాల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘అతి పెద్ద పురోగతి’ అంటూ ట్వీట్లో చేశారు.
లండన్: మారుతున్న కాలానికి అనుగుణంగా కామనె్వల్త్ను తీర్చిదిద్దే లక్ష్యంతో సారథ్య బాధ్యతను బ్రిటన్ యువరాజు చార్లెస్ చేపట్టనున్నారు. 90ఏళ్లు దాటిన ఎలిజిబెత్ రాణి సూచనమేరకు ఆయన వారసత్వానికి ఓటేస్తూ కామనె్వల్త్ ప్రభుత్వాధినేతలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. విండ్సర్ క్యాజిల్లో జరిగిన కామనె్వల్త్ దేశాల ఆంతరంగిక భేటీలో అన్ని దేశాల మధ్య ఈమేరకు అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది.
లండన్: భారత్లో జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా, కొన్ని గ్రూపులు ఇక్కడ చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. బుధవారం పార్లమెంట్ స్క్వేర్ వద్ద ఏర్పాటు చేసిన 53 దేశాల ఫ్లాగ్పోల్స్లో, భారత్కు చెందిన జాతీయ పతాకాన్ని కొందరు నిరసనకారులు కిందికి లాగేశారు. దీనిపై మెట్రోపాలిటన్ పోలీసులు వివరణ ఇస్తూ, ‘పార్లమెంట్ స్క్వేర్ వద్ద ఫ్లాగ్పోల్ నుంచి భారత పతాకాన్ని కొందరు కిందికి లాగేశారు.