S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

04/20/2018 - 02:12

లండన్, ఏప్రిల్ 19: కామన్‌వెల్త్ దేశాల అధినేతగా తన కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌ను నియమించాలని, బ్రిటన్ రాణి రెండో ఎలిజెబెత్, కామన్‌వెల్త్ సభ్య దేశాల అధినేతలకు విజ్ఞప్తి చేశారు. 53 దేశాల ఈ గ్రూపునకు నాయక త్వం వహించే విషయంలో బ్రిటన్ రాణి ప్రత్యక్షంగా క ల్పించుకోవడం ఇదే ప్రథమం. ఇక్కడ రెండు రోజుల పా టు జరిగిన చోగమ్ సమావేశాన్ని ఆమె ప్రారంభించారు.

04/20/2018 - 02:07

సమస్త జీవజాతుల్లో దేని ప్రత్యేకత దానిదే.. ఆకృతిలోనూ, ఆకారంలోనూ ఈ ప్రత్యేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తమ జాతి లక్షణాలను అన్ని జీవులూ ప్రస్ఫుటిస్తాయ.
ఉత్తర జర్మనీలోని ఓ గూట్లో ఇలా ఆనందాన్ని పంచుకుంటున్న చూడముచ్చటైన కొంగల జంట.

04/20/2018 - 01:35

న్యూయార్క్, ఏప్రిల్ 19: టైమ్ మ్యాగజీన్ ప్రకటించిన ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తుల జాబితాలో ఒలా సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్, బాలీవుడ్ నటి దీపికా పడుకొనె, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యానాదెండ్ల చోటు సంపాదించారు. వీరి పేర్లు జాబితాలోని తొలి వంద స్థానాల్లోపే ఉండటం గమనార్హం. ఇక వార్షిక గౌరవనీయుల జాబితాలోఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరు చేర్చారు.

04/19/2018 - 03:38

లండన్, ఏప్రిల్ 18: లింగాయత్ తత్వవేత్త బసవేశ్వర ప్రవచించిన సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. లండన్‌లోని థేమ్స్ నది ఒడ్డున నిర్మించిన 12వ శతాబ్దానకి చెందిన ప్రముఖ సంఘసంస్కర్త బసవేశ్వర విగ్రహానికి ఆయన బుధవారం పుష్పాంజలి సమర్పించారు.

04/19/2018 - 03:53

లండన్, ఏప్రిల్ 18: ఐరోపా సమాజంనుంచి బయటకు వెళ్లినప్పటికీ బ్రిటన్‌తో కొనసాగుతున్న సంబంధాల్లో ఏవిధమైన మార్పు ఉండబోదని ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని థెరెసా మేకు స్పష్టం చేశారు. బ్రెగ్జిట్ తర్వాత రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు మరింత జవజీవాలు కల్పించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. బుధవారం భారత్, బ్రిటన్ ప్రధానులు మోదీ, థెరెసా మే మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు ఫలవంతమయ్యాయి.

04/18/2018 - 01:07

స్టాక్‌హోమ్, ఏప్రిల్ 17: ఉభయతారకమైన రీతిలో అన్ని రంగాల్లోనూ వ్యూహాత్మ క భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని భారత్-స్వీడన్ నిర్ణయించాయి. అలా గే రక్షణ, భద్రత సహకారాన్ని కూడా విస్తృ తం చేసుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధాని స్టీఫెన్ లావెన్‌ల మ ధ్య జరిగిన కీలక చర్చల్లో సంకల్పించారు.

04/18/2018 - 00:48

ఈటా (ఉత్తరప్రదేశ్), ఏప్రిల్ 17: దేశాన్ని కుదిపేసిన కథువా సంఘటన మరువకముందే, ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఏ డేళ్ల బాలికపై అత్యాచారం జరిపి దారుణంగా హ త్య చేసిన సంఘటన ఈటాలో చోటుచేసుకుంది. సంఘటనపై ఆగ్రహించిన మృతురాలి తల్లిదండ్రులు ఈటా-్ఫరూకాబాద్ రహదారిని దిగ్బంధించి, రూ.10లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

04/17/2018 - 03:11

షిల్లాంగ్, ఏప్రిల్ 16: భారత దేశ కీర్తిప్రతిష్టలకు ప్రతీకలుగా నిలిచే సంస్థలు నీతి నిజాయితీలకు, నైతికవర్తనకు పట్టంగట్టాలని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన వరుస బ్యాంకు కుంభకోణాల వల్ల భారతదేశ ప్రతిష్టకు తీవ్రంగా భంగం కలిగిందని పేర్కొన్న ఆయన, బ్రాండ్ ఇండియా నాయకులు నైతిక విలువలకు పట్టంగట్టినప్పుడే దేశ పరువు నిలబడుతుందని, ప్రతిష్ట ఇనుమడిస్తుందని స్పష్టం చేశారు.

04/16/2018 - 04:31

లాహోర్, ఏప్రిల్ 15: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కేసులో కీలకమైన ఓ జడ్జి ఇంటిపై ఆదివారం ఉదయం కాల్పులు జరిగాయి. తెల్లవారు జామున 4.30 గంటలకు, ఉదయం 9 గంటలకు మరోసారి కాల్పులు జరిగినట్లు లాహోర్ పోలీసులు తెలిపారు. నవాజ్ షరీఫ్‌ను పదవీచ్యుతుడిని చేసిన పనామా పేపర్స్ కేసును విచారిస్తున్న సుప్రీం బోర్డులో న్యాయమూర్తి అయిన ఇజాజ్ ఉల్ హసన్ ఇంటిపై ఈ కాల్పులు జరిగాయి.

04/16/2018 - 04:30

లండన్, ఏప్రిల్ 15: ఈ వారంలో జరుగనున్న కామన్‌వెల్త్ దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సు (చోగమ్)కు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ వెళ్లనుండ టం విశేషం. ఎందుకంటే రెండేళ్లకోమారు జరిగే ఈ సమావేశాలకు దాదాపు దశాబ్దకాలంగా భారత్ హాజరు కావడంలేదు. 2009 నుంచి పెర్త్, కొలంబో, మాల్టాల్లో జరిగిన చోగమ్ సమావేశా ల్లో భారత్ పాల్గొనలేదు.

Pages