-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
వాషింగ్టన్, ఏప్రిల్ 5: యూజర్ల సమాచార భద్రతపై తమ సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఇందుకోసం కృత్రిమ మేధోపకరణాలను ఉపయోగిస్తూ వే లాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఫేస్బుక్ సీఈఓ జూకర్బర్గ్ వెల్లడించాడు. ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, 2018 ‘ఎన్నికల సంవత్సరం’గా పేర్కొన్నాడు.
బకు, ఏప్రిల్ 5: ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. ఉగ్రవాదం ‘మా పౌరుల ను’ చంపుతోంది, అభివృద్ధి లక్ష్యాలను అడ్డుకుంటోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలీనోద్య మ (ఎన్ఏఎం) 18వ మధ్యంతర మంత్రుల స్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని ఆమె పేర్కొన్నారు.
ఇస్లామాబాద్: కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్కు శిక్షపడటాన్ని తప్పుపట్టిన పాకిస్తాన్ మతం రంగుపులుముతూ వ్యాఖ్యలు చేసింది. సల్మాన్ఖాన్ ముస్లిం అయినందువల్లే అతడిని జైలుకు పంపుతూ జోథ్పూర్ కోర్టు తీర్పు ఇచ్చిందని, భారత్లో ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు భద్రత లేదని పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఖవాజా అసిఫ్ విమర్శలు చేశారు.
వాషింగ్టన్: ముంబయి దాడులకు బాధ్యుడైన హఫీస్ సరుూద్ నేతృత్వంలోని మిల్లీ ముస్లిం లీగ్ (ఎంఎంఎల్) పార్టీని ‘విదేశీ ఉగ్రవాద సంస్థ’గా ప్రకటించింది. ఈ ప్రకటనతో పాకిస్తాన్లో కీలక రాజకీయ నేతగా ఎదగాలన్న హఫీజ్ సరుూద్ ఆశలపై నీరు చల్లినట్లయింది. ఇదే సమయంలో ఎంఎంఎల్కు చెందిన ఏడుగురు కేంద్ర నాయకులను కూడా విదేశీ ఉగ్రవాదులుగా ప్రకటించింది.
కుందుజ్ (ఆఫ్గానిస్తాన్), ఏప్రిల్ 3: ఆఫ్గానిస్తాన్లోని కుందుజ్ ప్రావిన్స్లోని ఒక మదర్సాపై జరిగిన వైమానిక దాడిలో భారీ ప్రాణనష్టం సంభవించింది. కనీసం 70 మంది మరణించి ఉంటారని ప్రాథమిక సమాచారం. మృతుల్లో చిన్నారులు ఎక్కువగా ఉన్నారు. దస్త్-ఇ-అర్చి జిల్లాలోని ఓ మత విద్యాసంస్థ లక్ష్యంగా సోమవారం రాత్రి వైమానిక దాడులు సాగాయి. తాలిబన్కు చెందిన కీలక కమాండర్ల ఈ దాడిలో మరణించినట్లు తెలుస్తోంది.
జొహనె్నస్బర్గ్, ఏప్రిల్ 2: దక్షిణాఫ్రికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు నెల్సన్ మండేలా మాజీ భార్య విన్నీ మండేలా (81) సోమవారం మృతి చెందారు. ఆమె సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జొహనె్నస్బర్గ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు ఆసుపత్రి ప్రతినిధి విక్టర్ ద్లామిని తెలిపారు. నెల్సన్ మెండేలాతో ఆమె 38 ఏళ్లపాటు కలిసి జీవించారు.
బీజింగ్, ఏప్రిల్ 1: నాటి స్కైలాబ్ను తలపించే రీతిలో నేడు మరో స్పేస్ స్టేషన్ భూమి మీద కుప్పకూలబోతోంది. చైనా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రోదసి స్పేస్ స్టేషన్ తియాంగాంగ్-1 సోమవారం భూ వాతావరణంలోకి ప్రవేశించబోతోంది. దీని శకలాలు ఆస్ట్రేలియా నుంచి అమెరికా మధ్య ఎక్కడైనా భూమి మీద పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
చిత్రాలు..వాటికన్ సిటీలోని సెయంట్ పీటర్స్ బాసిలికాకు అశేషంగా తరలివచ్చినవారికి ఆశీర్వచనాలు పలుకుతున్న పోప్ ఫ్రాన్సిస్
వాషింగ్టన్, ఏప్రిల్ 1: ఎన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సర్కారు విధించిన కఠిన నిబంధనల నడుమ హెచ్1బీ వీసా దరఖాస్తుల ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. అమెరికా విధానం ప్రకారం 2019 ఆర్థిక సంవత్సరానికిగాను అక్టోబర్ 1నుంచి జారీ చేసే ఈ వీసా కోసం సోమవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీ రంగానికి చెందిన నిపుణులు అమెరికాలో పనిచేసేందుకు తహతహలాడుతుంటారు. అలాంటివారికి హెచ్1బీ వీసా తప్పనిసరి.
బెంఘాజీ, మార్చి 30: తూర్పు లిబియాలో శుక్రవారం జరిగిన కారుబాంబు దాడిలో మొత్తం ఎనిమిదిమంది మరణించారు. నెలరోజుల్లో ఇటువంటి దాడి జరగడం ఇది రెండోసారి. లిబియా ఉక్కు మనిషి ఖలీఫా హఫ్తార్ విధేయులైన సైనికులు కాపలా కాస్తున్న బారికేడ్ వద్దకు పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో వచ్చిన ఉగ్రవాది వాహనాన్ని ఒక్కసారి పేల్చేశాడని పోలీసులు తెలిపారు.