S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

01/29/2018 - 02:56

ఇరాన్‌లో గత రెండు రోజులుగా విపరీతమైన మంచు కురుస్తోంది. రాజధాని టెహ్రాన్‌లోని రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయ. దేశంలో ఉత్తర, పశ్చిమ దిక్కుల్లోని 20 ప్రావెన్సీల్లో రాకపోకలకు సైతం తీవ్ర అవాంతరం ఏర్పడింది. పర్వత ప్రాంతాల్లో ఏకంగా 1.3 మీటర్ల మేర మంచు పేరుకుపోయంది. టెహ్రాన్‌లో ఆదివారం నాటి దృశ్యమిది.

01/28/2018 - 02:58

ఐరాస, జనవరి 27: కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ పాడిన పాటనే మళ్లీ మళ్లీ పాడుతోంది. కాశ్మీర్ వివాద పరిష్కారానికి భారత్ -పాక్‌ల మధ్య మధ్యవర్తిత్వం నెరపే ఆలోచనే లేదంటూ ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తెగేసి చెప్పి రోజులు గడవకముందే మధ్య ఆసియా అంశంపై భద్రతా మండలిలో నిర్వహించిన సమావేశంలో పాక్ దౌత్యవేత కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

01/28/2018 - 02:20

వాషింగ్టన్, జనవరి 27: భారత 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఐక్యరాజ్యసమితిలో కోలాహలంగా నిర్వహించారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్‌లకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ‘మండలి’లో శాశ్వత సభ్యత్వం ఉన్న అమెరికా ప్రతినిధి మాత్రం హాజరు కాలేదు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీహేలీ స్థానికంగా లేకపోవడంతో హాజరు కాలేదు.

01/28/2018 - 01:21

కాబూల్, జనవరి 27: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. విదేశీ రాయబార కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని శనివారం జరిగిన ఈ బాంబుదాడిలో 95 మంది మరణించారని, 158 మంది గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. అంబులెన్స్‌లో బాంబులు పెట్టి పేల్చివేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

01/27/2018 - 02:18

సింగపూర్, జనవరి 26: భారత్ - ఆసియాన్ దేశాల మధ్య ఎలాంటి విభేదాలు, వివాదాలు, ఆధిపత్య ధోరణులు లేకుండా సారభౌమత్వ సమానత్వంతోనే మైత్రీబంధం కొనసాగుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ వైశాల్యాలతో సంబంధం లేకుండా అన్ని విధాలుగా ఈ దేశాలు వ్యాపార, వాణిజ్యపరంగా సంధానమవుతున్నాయని పది ఆసియా దేశాలకు చెందిన పత్రికల్లో రాసిన ఆప్ ఎడ్ వ్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

01/27/2018 - 00:59

దావోస్, జనవరి 26: కాశ్మీర్ సమస్యతో పాటు కొత్తగా రోహింగ్యాల సంక్షోభం తలెత్తడానికి ప్రపంచ దేశాల మధ్య సఖ్యత లేకపోవడమే కారణమని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో పాకిస్తాన్ స్పష్టం చేసింది. ఈ రెండు అంశాలపై అంతర్జాతీయ వేదికపై చర్చ జరగాలని పాక్ డిమాండ్ చేసింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాహిద్ ఖాఖన్ అబ్బాసీ కేబినెట్ సహచరులతో కలిసి మీడియాతో మాట్లాడారు.

01/26/2018 - 02:47

వాషింగ్టన్, జనవరి 25: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశంలోని డ్రీమర్లకు ఊరట కలిగించే ప్రకటన చేశారు. డ్రీమర్లుగా పిలిచే అక్రమ వలసదారుల కోసం ఓ కార్యాచరణను రూపొందించనున్నట్టు గురువారం ఆయన వెల్లడించారు. డ్రీమర్లకు పౌరసత్వం కల్పించేందుకు ఇమ్మిగ్రేషన్ చట్టం తీసుకురానున్నామని ఆయన స్పష్టం చేశారు. రానున్న 12 ఏళ్లలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన అన్నారు.

01/26/2018 - 02:45

ఇస్లామాబాద్, జనవరి 25: సంజయ్ లీలా భన్సాలీ వివాదాస్పద ‘పద్మావత్’ చిత్రానికి ఎలాంటి కత్తిరింపులు లేకుండా పాకిస్తాన్ సెన్సార్‌బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇస్లామాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సెన్సార్స్ (సీబీఎఫ్‌సీ) చైర్మన్ మొబాషీర్ హసన్ ఎలాంటి కట్స్ లేకుండా పాక్‌లో విడుదలకు అనుమతి ఇచ్చినట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

01/24/2018 - 23:44

బీజింగ్, జనవరి 24: భారత్‌పై చైనా సరికొత్త ప్రేమ ప్రదర్శించింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం అత్యద్భుతమంటూ ప్రశంసలు గుప్పించింది. ‘స్వదేశీ వస్తు రక్షితవాదం ఉగ్రవాదం కంటే మహా ప్రమాదం’ అంటూ మంగళవారం డబ్ల్యుఈఎఫ్ వేదికపై మోదీ చేసిన ప్రసంగం చైనాను ఆకట్టుకుంది.

01/24/2018 - 23:44

వాషింగ్టన్, జనవరి 24: అణ్వాయుధ వ్యాప్తి నిరోధంలో భారత్ చేస్తున్న కృషి అద్భుతమంటూ అమెరికా కితాబిచ్చింది. ఆస్ట్రేలియా గ్రూపులో సభ్యత్వాన్ని పొందినందుకు భారత్‌ను అభినందించింది. ట్రంప్ ప్రభుత్వం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఎంతో విలువనిస్తున్నామని, భారత్ తమకు అత్యంత సన్నిహితమైన, విలువైన మిత్ర దేశమని తెలిపింది.

Pages