S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

01/24/2018 - 23:40

బెంఘాజీ, జనవరి 24: లిబియాలో కారుబాంబు పేలుళ్లు 34 మందిని బలితీసుకున్నాయి. మసీదు నుంచి బయటకు వస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. 34మంది చనిపోగా 87 మంది గాయపడ్డారు. బుధవారం సాయంకాలపుప్రార్థనలు ముగించుకుని వస్తుండగా తొలి కారు పేలుళ్లు సంభవించాయి. ఆ సమయంలో అక్కడ జనం గుమికూడగా మరో బాంబు పేలుడు సంభవించింది. 30 నిముషాల వ్యవధిలోనే రెండు కారు బాంబు పేలుళ్లు జరిగాయి.

01/24/2018 - 23:39

వాషింగ్టన్, జనవరి 24: అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా)కు చెందిన ఇద్దరు వ్యోమగాములు ఈ ఏడాది తొలి స్పేస్‌వాక్ చేశారు. మార్క్ వాండే హే, స్కాట్ టింగ్లే అనే వ్యోమగాములు మంగళవారం స్పేస్ బయట ఏడు గంటల 24 నిముషాలను నడిచారని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్(ఐఎస్‌ఎస్) వెల్లడించింది. వ్యోమగాములిద్దరూ కెనెడియన్ రొబోటిక్ ఆర్మ్ కెనాడర్మ్-2లో పనిచేస్తున్నారు.

01/24/2018 - 02:05

వాషింగ్టన్, జనవరి 23: ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పదే పదే ఉగ్రదాడులకు పాల్పడుతున్న తాలిబన్ నేతలను తక్షణం అరెస్టు చేయడమో లేదా బహిష్కరించడమో చేయాలని పాకిస్తాన్‌కు అమెరికా గట్టిగా సూచించింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఓ హోటల్‌పై ఉగ్రదాడి ఫలితంగా 22 మంది మరణించడంపై అమెరికా తీవ్రంగా స్పందించింది.

01/24/2018 - 02:04

అలాస్కా, జనవరి 23: ఉత్తర అమెరికాలోని కొడియాక్ దీవిలో మంగళవారం తెల్లవారుజామున 7.9 పాయింట్ల తీవ్రతతో పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రత నేపథ్యంలో సునానీ హెచ్చరికను జారీ చేసినప్పటికీ తరువాత దాన్ని ఉప సంహరించుకున్నారు. రిక్టర్ స్కేల్‌పై అత్యధికంగా ఉండడంతో అలాస్కా తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ కావడంతో ప్రజలు భయంతోపరుగులు పెట్టారు.

01/24/2018 - 01:55

వాషింగ్టన్, జనవరి 23: భూమికి దగ్గరగా ఉన్న మరో మధ్యస్థాయి గ్రహ శకలం పుడమి దిశగా దూసుకువస్తోంది. ఫిబ్రవరి 4న ఈ ఖగోళ ఘటన జరిగే అవకాశం ఉందని ఏజే 129 అనే గ్రహశకలం భూమికి సమీపం నుంచి దూసుకుపోయినా ఎలాంటి ముప్పు ఉండదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) వెల్లడించింది.

01/24/2018 - 01:35

దావోస్, జనవరి 23: ఉగ్రవాదం, రక్షితవాదం, పర్యావరణ సమతూకానికి కలుగుతున్న విఘాతాలు ప్రపంచ దేశాలకు తీవ్ర ఆందోళన, ఆవేదన కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 20యేళ్ల తరువాత ప్రపంచ ఆర్థిక ఫోరం వేదికపై మాట్లాడిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వర్తమాన ప్రపంచ సమస్యలను వివిధ దేశాల అధినేతలు, ప్రభుత్వాధినేతల దృష్టికి తీసుకొచ్చారు. రక్షితవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని హెచ్చరించారు.

01/23/2018 - 03:21

జ్యూరిచ్, జనవరి 22: ఈ మూడేళ్ల కాలంలో భారత్ సాధించిన అభివృద్ధి విజయాలను ప్రపంచ ఆర్థిక ఫోరం వేదిక సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ నేతల కళ్లకు కట్టబోతున్నారు. జిఎస్టీ, పెద్దనోట్ల రద్దు సహా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలతో భారత ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చడంతోపాటు వృద్ధి, అభివృద్ధి, ఉపాధివంటి కీలకాంశాల విషయంలోనూ తాము సాధించిన విజయాలను మోదీ ప్రపంచ ఆర్థిక ఫోరం వేదిక ఆవిష్కరించనున్నారు.

01/23/2018 - 02:10

దావోస్, జనవరి 22: అంతర్జాతీయ ఆర్థిక ఫోరం (డబ్లుఈఎఫ్)వార్షిక భేటీకి వేదికైన దావోస్ భారతీయతతో మార్మోగిపోతోంది. ప్రపంచం నలు దిశల నుంచి వ్యాపార, వాణిజ్య దిగ్గజాలు తరలివస్తున్న దావోస్‌లో ఎటూ చూసినా ‘భారత్.. భారత్..’ అన్న నినాదాలతో కూడిన బిల్ బోర్డులు, లాంజ్‌లు భారత దేశం సాధించిన అభివృద్ధిని, భారత కంపెనీల ఖ్యాతిని చాటిచెప్పే రీతిలో నలుమూలలా కనిపిస్తున్నాయి.

01/22/2018 - 02:45

కాబూల్, జనవరి 21: దాదాపు 12 గంటలపాటు కాబూల్ హోటల్‌పై దాడి చేసి, దాన్ని దిగ్బంధం చేసిన సంఘటనకు ఆదివారం తెరపడింది. మిలిటెంట్లు జరిపిన దాడిలో ఓ విదేశీయుడు సహా ఆరుగురు మరణించారని అధికార వర్గాలు తెలిపాయి. దాడి చేసిన నలుగురు మిలిటెంట్లను అఫ్గాన్ భద్రతా దళాలు హతమార్చాయని దేశీయ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నజీబ్ డానిష్ తెలిపారు.

01/22/2018 - 03:56

బోస్టన్, జనవరి 21: అసలు ఈ భూమీదికి జలసంపద ఎలా వచ్చిందన్నది సమాధానం లేని ప్రశ్నగానే ఖగోళవేత్తలను నిరంతరం వేధిస్తూనే వచ్చింది. అయితే ఇందుకు సంబంధించి ఎడతెరిపి లేకుండా జరిపిన అధ్యయనాలు, పరిశోధనల ఫలితంగా తాజాగా ఓ కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. సౌర వ్యవస్థ ఆవిర్భవించిన మొదటి 20 లక్షల సంవత్సరాల కాలంలోనే ఉల్కల కారణంగా భూమీదికి జల సంపద వచ్చిందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

Pages