S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/16/2017 - 01:11

సియోల్, సెప్టెంబర్ 15: వరస క్షిపణి ప్రయోగాలతో పొరుగు దేశాలకు హడలు పుట్టిస్తున్న ఉత్తర కొరియా శుక్రవారం తాజాగా మరో క్షిపణి ప్రయోగం జరిపింది. నెల రోజుల వ్యవధిలో రెండో సారి జపాన్ మీదుగా పసిఫిక్ మహాసముద్రంలోకి క్షిపణిని ప్రయోగించింది.

09/15/2017 - 23:35

వాషింగ్టన్, సెప్టెంబర్ 15: అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో తెలంగాణకు చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ నాగిరెడ్డి అచ్యుత్ రెడ్డి హత్య కేసులో ఆన పేషెంట్లలో ఒకరైన భారతీయ సంతతికి చెందిన 21 ఏళ్ల ఉమర్ రషీద్ దత్‌ను అరెస్టు చేసినట్లు విచిటా పోలీసు డిపార్ట్‌మెంట్ అధికారి లెఫ్టెనెంట్ టాడ్ ఓజిలి గురువారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు. బుధవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.

09/15/2017 - 02:19

ఢాకా, సెప్టెంబర్ 14: మయన్మార్‌నుంచి వరదలా వచ్చిపడుతున్న రోహింగ్యా ముస్లిం శరణార్థులను ఆదుకోవడానికి భారత్ 53 టన్నుల సహాయక సామగ్రిని గురువారం పంపించింది. గత వారం న్యూఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషనర్ సయ్యద్ ముజీమ్ అలీ విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్‌ను కలిసి రోహింగ్యాల సమస్యను వివరించిన తర్వాత మన దేశం ఈ సహాయక సామగ్రిని పంపించింది.

09/15/2017 - 02:18

పోంగ్యాంగ్, సెప్టెంబర్ 14: వరుస క్షిపణి ప్రయోగాలు జరుపుతూ, పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తర కొరియాపై ఐరాస ఆంక్షలు విధించడంలో కీలకపాత్ర వహించిన అమెరికా, జపాన్‌లపై ఉత్తర కొరియా ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. జపాన్‌ను ముంచేస్తామని, అమెరికాను బూడిద చేస్తామంటూ హెచ్చరించింది.

09/15/2017 - 02:17

వాషింగ్టన్, సెప్టెంబర్ 14: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీపై ట్రంప్ గెలిచారు. ‘వాట్ హేపెన్డ్’ పేరుతో హిల్లరీ ఓ పుస్తకాన్ని రాసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు ఆమె వివరించారు. హిల్లరీ వ్యాఖ్యలపై ట్రంప్ తన ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు.

09/15/2017 - 01:05

కౌలాలంపూర్, సెప్టెంబర్ 14: మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఒక ముస్లిం పాఠశాలలో గురువారం తెల్లవారుజామున సంభవించిన అగ్నిప్రమాదంలో 25 మంది సజీవ దహనమయ్యారు. పాఠశాల కిటికీలన్నిటికీ ఇనుప గ్రిల్స్ ఉండడంతో బైటికి వెళ్లడానికి ఒకే మార్గం ఉండడంతో ప్రాణభయంతో లోపల ఉన్న జనం కేకలు పెడ్తున్నా చుట్టూ ఉన్న జనం చూస్తూ ఉండిపోవలసి వచ్చిందే తప్ప ఎలాంటి సాయం చేయలేకపోయారు.

09/14/2017 - 01:21

యాంగోన్, సెప్టెంబర్ 13: మయన్మార్‌లోని రోహింగ్యా ముస్లింలకు మద్దతుగా నిలవాలని అల్‌ఖైదా మిలిటెంట్లు ప్రపంచ దేశాల్లోని ముస్లింలకు పిలుపునిచ్చారు. అంతేకాదు మయన్మార్ ప్రభుత్వం నేరాలకు తగిన శిక్ష తప్పనదని కూడా హెచ్చరించరు.

09/14/2017 - 01:21

ఐక్యరాజ్యసమితి, సెప్టెంబర్ 13: రాజకీయాలను పక్కనపెట్టి మయన్మార్‌నుంచి పారిపోయి వస్తున్న శరణార్థులను ఆదుకోవడానికి కొనసాగుతున్న మానవతా కృషికి మద్దతు ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశలకు విజ్ఞప్తి చేసింది. బౌద్ధులు మెజారిటీగా ఉన్న మయన్మార్‌లోని రఖినే రాష్ట్రంలో ఉండే మైనారిటీ ముస్లింలే ఈ రోహింగ్యాలు. వీరు అనేక దశాబ్దాలుగా అణచివేతను ఎదుర్కొంటున్నారు.

09/14/2017 - 01:18

అహ్మదాబాద్, సెప్టెంబర్ 13: భారత్-జపాన్ మధ్య వెల్లివిరిసిన స్నేహ బంధానికి అహ్మదాబాద్ వీధులు బుధవారం ప్రతీకగా నిలిచాయి. జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ 8 కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించి ఈ స్నేహానికి సరికొత్త సౌరభాన్ని అందించారు. ఈ ఎనిమిది కిలోమీటర్లమేర అహ్మదాబాద్ ప్రజలు నృత్యాలు, పాటలతో ఇరుదేశాల ప్రధానులకు ఆనందోత్సహాలతో స్వాగతం పలికారు.

09/13/2017 - 03:13

వాషింగ్టన్, సెప్టెంబర్ 12: భారత్‌లో రాజకీయాలు మొదలుకొని, వ్యాపారాల వరకు అన్ని రంగాల్లోనూ వారసత్వాలు సర్వ సాధారణమేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అయితే పూర్వీకులనుంచి సంక్రమించిన దానికన్నా ఒక వ్యక్తి సామర్థ్యం ముఖ్యమని స్పష్టం చేశారు.

Pages