S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/05/2017 - 00:58

‘దౌత్య ప్రయత్నాలన్నీ హరించుకు పోయాయి. ఉత్తర కొరియాపై అత్యంత కఠిన చర్యలకు సమయమొచ్చింది’ అని అమెరికా పిలుపునిచ్చింది. తాజాగా జరిగిన హైడ్రోజన్ బాంబు పరీక్షపై ప్రపంచ దేశాలన్నీ షాక్‌కు గురయ్యాయి. భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై మార్గాంతరాలపై చర్చించింది. ఇందులో మాట్లాడిన అమెరికా రాయబారి నిక్కీ హేలీ ‘ఇప్పటి వరకూ జరిగింది చాలు.. కఠిన చర్యలే తదుపరి మార్గం’ అని తెలిపారు.

09/05/2017 - 01:44

కియామెన్ (చైనా), సెప్టెంబర్ 4: అయిదు దేశాల కూటమి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత్ ఘనమైన దౌత్య విజయాన్ని సాధించింది. ఉగ్రవాద అంశాన్ని ప్రస్తావించటాన్ని అనుమతించేది లేదని చైనా తెగేసి చెప్పినప్పటికీ, భారత్ అనుకున్న విజయం సాధించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్ ఏ మహ్మద్, లష్కర్ ఎ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల చర్యలను గర్హిస్తూ బ్రిక్స్ దేశాలు తీర్మానాన్ని చేపట్టాయి.

09/04/2017 - 02:00

వాషింగ్టన్, సెప్టెంబర్ 3: ఉత్తర కొరియా ఆదివారం హైడ్రోజన్ బాంబును పరీక్షించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ప్రపంచ దేశాలన్నీ మండిపడ్డాయి. చివరికి ఉత్తర కొరియా మిత్రదేశమైన చైనా సైతం ఇలాంటి తప్పుడు చర్యలను మానుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌కు హితవు చెప్పింది. ఉత్తర కొరియా చేష్టలు, ప్రకటనలు అమెరికాకు వ్యతిరేకంగా, అత్యంత ప్రమాదకరంగా మారాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.

09/04/2017 - 01:37

సియోల్, సెప్టెంబర్ 3: ఉత్తర కొరియాకు అమెరికా సంకీర్ణ దళాలకు మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఉత్తర కొరియా ఆరోసారి విజయవంతంగా అణ్వస్త్రాన్ని పరీక్షించింది. సుదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు సైతం మోసుకుపోగల హైడ్రోజన్ బాంబును సఫలీకృతంగా పరీక్షించినట్లు ఉత్తరకొరియా టెలివిజన్ ప్రకటించింది.

09/03/2017 - 22:53

జియామెన్, సెప్టెంబర్ 3: చైనాలోని జియామెన్‌లో సోమవారంనుంచి జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఇక్కడికి చేరుకున్నారు. చైనాలో తన రెండు రోజుల పర్యటన సందర్భంగా మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో పాటుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇతర బ్రిక్స్ దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

09/03/2017 - 02:59

కరాచీ, సెప్టెంబర్ 2: తన భార్య బేనజీర్ భుట్టో హత్యకేసులో వెలువడిన తీర్పు ఎంతమాత్రం సంతృప్తికరంగా లేదని, దానిపై అప్పీల్ చేసుకుంటానని ఆమె భర్త, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీ శనివారం ఇక్కడ వెల్లడించారు. 2007లో జరిగిన ఈ హత్య కేసులో నిందితులైన ఐదుగురు తాలిబన్ మిలిటెంట్లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని ఆయన నిరసించారు.

09/03/2017 - 02:56

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: రానున్న కాలంలో ప్రపంచాన్ని శాసించేది ప్రత్యామ్నాయ మేథస్సేనని (ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానంలోని ఈ సరికొత్త అంశాన్ని అవపోసన పట్టగలిగినవారే రాజ్యం చేస్తారని ఆయన ఉద్ఘాటించారు. ఒక రష్యాకే కాదు, మొత్తం మానవాళికే ఈ ప్రత్యామ్నాయ మేథస్సు అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.

09/03/2017 - 02:48

లండన్, సెప్టెంబర్ 2: గ్రహాంతర జీవుల గురించి తాజాగా ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విశ్వంలోని ఇతర గ్రహాల్లో జీవజాతులు ఏవైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటే, వాటి ఆకృతి ఏమిటన్నది దీర్ఘకాలంగా మానవ మేథస్సును తొలిచేస్తున్న ప్రశ్న. ఈ అంశంపై దశాబ్దాలుగా అద్యయనం చేస్తున్న ప్రపంచ ప్రఖ్యాత భౌతిక అంతరిక్ష శాస్తవ్రేత్త స్టీఫెన్ హాకింగ్ సారథ్యంలోని మిషన్ ఓ కీలక అంశాన్ని తెరపైకి తెచ్చింది.

09/03/2017 - 02:44

బీజింగ్, సెప్టెంబర్ 2: భారత్, చైనాల మధ్య గత కొన్ని వారాలుగా సెగలు కక్కుతున్న డోక్లామ్ ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఇరు దేశాల అగ్రనేతలు సమావేశం కానున్నారు. ఐదు దేశాల బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర భేటీలో పాల్గొనేందుకు వస్తున్న భారత ప్రధానితో చైనా అధ్యక్షుడు ముఖాముఖి సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనా ఆగ్నేయ పట్టణమైన జియామెన్‌లో మూడు రోజులపాటు ఈ శిఖరాగ్ర భేటీ ఆదివారం నుంచి మొదలవుతుంది.

09/02/2017 - 02:31

యాంగోన్, సెప్టెంబర్ 1: ఈ మధ్య కాలంలో 27 వేలమందికి పైగా రోహింగ్యా ముస్లింలు మైన్మార్‌నుంచి బంగ్లాదేశ్‌కు పారిపోయారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. కాగా, ఇలా పారిపోయిన వారిలో కొందరు సరిహద్దుల్లోని నదిని దాటడానికి జరిపిన ప్రయత్నంలో మునిగి పోయి చనిపోవడంతో, వారి మృతదేహాలు శుక్రవారం బంగ్లాదేశ్ వైపు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి.

Pages