S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/07/2017 - 03:12

వాషింగ్టన్, ఆగస్టు 6: అయిదేళ్ల క్రితం అమెరికాలోని ఓక్ క్రీక్ గురుద్వారాపై కాల్పులు జరిపి ఆరుగురు సిక్కులను పొట్టన పెట్టుకున్న సంఘటన సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా జాత్యహంకారం, మత విద్వేషం, హింసకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విద్వేషం, విభేదాలకన్నా తాము బలమైన వాళ్లమని గత అయిదేళ్ల కాలంలో ఓక్ క్రీక్ ప్రజలు నిరూపించారని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పౌల్ రియాన్ అన్నారు.

08/07/2017 - 03:01

మనీలా, ఆగస్టు 6: ఆసియాన్‌తో గత పాతిక సంవత్సరాలుగా భారత్ సంబంధాలు ఎన్నో కొంత పుంతలు తొక్కుతూ వస్తున్నాయని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ అన్నారు. ఈ కూటమితో సాంస్కృతికంగానూ, రాజకీయంగానూ లోతైన బంధాన్ని పెనవేసుకుంటూ వచ్చిన భారత్ మంత్రిత్వ స్థాయి సమావేశాలు, శిఖరాగ్ర సదస్సులతో మరింత చేరువైందని అన్నారు.

08/07/2017 - 02:59

మాస్కో, ఆగస్టు 6: ఉత్తర కొరియాను దౌత్యపరంగా ఎదుర్కొని దాన్నుంచి తలెత్తే అణు ముప్పును నిరోధించేందుకు రష్యా, చైనాతో కలిసి పనిచేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉత్తర కొరియాపై ఆర్థిక ఆంక్షలను విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఈ రెండు దేశాలు సమర్థించడాన్ని ఆయన హర్షించారు.

08/07/2017 - 02:58

బ్రిడ్జ్‌వాటా (అమెరికా), ఆగస్టు 6: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంతర్గతంగానూ, బహిర్గతంకానూ సమస్యలు, సవాళ్లతో సతమతమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు 17 రోజుల వ్యాహ్యాళికి వెళ్లారు. సెంట్రల్ న్యూజెర్సీలోని తన సొంత గోల్ఫ్ క్లబ్‌లో ట్రంప్ విశ్రాంతి తిసుకుంటారు. ఆయనతోపాటు కుమార్తె ఇవాంకా ట్రంప్, అల్లుడు ఖుష్‌నేర్, కొందరు సహాయకులు ఉన్నారు.

08/04/2017 - 02:34

ఇస్లామాబాద్, ఆగస్టు 3: పాకిస్తాన్ పరిస్థితులు ఎప్పుడు అదుపుతప్పినా వాటిని గాడిలోపెట్టింది సైనిక పాలకులేనని మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో వచ్చిన సైనిక పాలనలన్నీకూడా సరైనవేనంటూ గట్టిగా సమర్ధించుకున్నారు.‘పౌర ప్రభుత్వాలు దేశాన్ని గాడితప్పిస్తే సైనిక పాలకులు పరిస్థితులను చక్కదిద్ది మళ్లీ గాడిలోపెట్టారు’అని ముషారఫ్ అన్నారు.

08/04/2017 - 01:40

లాహోర్, ఆగస్టు 3: పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికైన షాహిద్ ఖకన్ మరో పది నెలలు పదివిలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో పదినెలలు పదవీ కాలం ఉన్న మాజీ ప్రధాని షరీఫ్‌ను పాక్ అత్యున్నత న్యాయస్థానం పనామా పేపర్స్ కేసులో పదవికి అనర్హుడిగా తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ప్రధాని పదవిని తన సోదరుడు, పంజాబ్ ముఖ్యమంత్రి షహబాజ్‌కు అప్పజెబుదామని మొదట నవాజ్ షరీఫ్ అనుకున్నారు.

08/03/2017 - 02:17

ఐక్యరాజ్య సమితి, ఆగస్టు 2: తల్లిపాల ద్వారా నివారించగలిగిన వ్యాధుల కారణంగా భారత దేశంలో ప్రతి ఏటా దాదాపు లక్ష మంది చిన్నారులు చనిపోతున్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. అంతేకాకుండా బాలింతలు తమ పిల్లలకు తగినంతగా స్తన్యాన్ని ఇవ్వకపోవడం కారణంగా సంభవించే శిశు మరణాలు, ఇతర నష్టాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా 1400 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లుతోందని కూడా ఆ నివేదిక పేర్కొంది.

08/03/2017 - 02:17

వాషింగ్టన్, ఆగస్టు 2: సింధూ నదీ జలాల పంపిణీకి సంబంధించిన అంశాలపై భారత్, పాకిస్తాన్‌లు వచ్చే నెల వాషింగ్టన్‌లో మరోదఫా చర్చలు జరపనున్నట్లు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. సింధూ నదీ జలాల ఒప్పందానికి సంబంధించి తన వైఖరిని తెలియజేస్తూ ప్రపంచ బ్యాంక్ సుదీర్ఘమైన ఒక వాస్తవ సమాచార పత్రాన్ని సైతం విడుదల చేసింది.

08/03/2017 - 02:16

వాషింగ్టన్, ఆగస్టు 2: అమెరికా వర్కర్లస్థానం లో చౌకగా లభించే విదేశీ వర్కర్లను నియమించుకోవడం కోసం ఔట్‌సోర్సింగ్ సంస్థలు హెచ్- 1బి, ఎల్-1 వీసాలను దుర్వినియోగం చేయడాన్ని ఆపాలని, అమెరికా కాంగ్రెస్ ఉభయ సభ ల్లో పలుకుబడిన సభ్యులతో కూడిన బృందం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఒక లేఖ రాసింది. జూలై 27న రాసిన ఈ లేఖను మంగళవారం మీడియాకు విడుదల చేశారు.

08/03/2017 - 01:48

న్యూఢిల్లీ, ఆగస్టు 2: వివాదాస్పద డోక్లామ్ ప్రాంతంనుంచి భారత్ తన సైనిక దళాలను తగ్గించుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్ తన సైన్యాన్ని కొంతమేర వెనక్కి తీసుకుందంటూ చైనా ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు అధికార వర్గాలు సమాచారాన్ని వెల్లడించాయి.

Pages