S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/09/2017 - 02:28

హాంబర్గ్, జూలై 8: ఉగ్రవాద నిరోధంపై జి-20 సదస్సులో జరిగిన చర్చల్లో భారత్‌ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపించింది.

07/09/2017 - 02:08

సియోల్, జూలై 8: కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్తర కొరియాపై అమెరికా శనివారం తీవ్రస్థాయిలో గర్జించింది. తమ యుద్ధ విమానాలతో శనివారం దక్షిణ కొరియాలో లైవ్ ఫైర్ డ్రిల్ నిర్వహించి ఉత్తర కొరియాకు బలమైన హెచ్చరిక పంపింది. అమెరికా ఇటువంటి విన్యాసాలను నిర్వహించడం చాలా అరుదు.

07/09/2017 - 02:03

చిత్రాలు.. అర్జెంటీనా అధ్యక్షుడు వౌరిసియో మాక్రితో, ఇటలీ ప్రధాని పావ్‌లో జెంటిలోనితో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ

07/09/2017 - 02:00

చిత్రాలు.. జి-20 సమావేశాల సందర్భంగా వియత్నాం అధ్యక్షుడితో కరచాలనం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.
*భారత్‌లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చుకుంటూ మోదీకి ఫుట్‌బాల్‌ను బహూకరిస్తున్న నార్వే ప్రధాని ఎర్నా సోల్‌బెర్గ్

07/09/2017 - 01:56

హాంబర్గ్, జూలై 8: జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జపాన్ ప్రధాని షింజే అబేతో భేటీ అయి ఇరు దేశాల సంబంధాల పురోగతిని సమీక్షించారు. వివాదాస్పద దక్షిణ, తూర్పు సముద్రాల్లో చైనా మిలటరీ ఆధిపత్యం పెరిగిపోతున్న తరుణంలో ఇరు దేశాలు మలబార్ నౌకాదళ విన్యాసాలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇరువురు నేతలు సమావేశం కావడం గమనార్హం.

07/09/2017 - 01:50

హాంబర్గ్, జూలై 8: జి-20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా హాంబర్గ్‌లో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అనేక అంశాలను చర్చించారంటూ తాము చేసిన ప్రకటనను వివరించడానికి భారత్ నిరాకరించింది. సిక్కిం సెక్టార్‌లో ఇరు దేశాల సైన్యాల మధ్య ఉద్రిక్తత నెలకొని ఉన్న తరుణంలో ఈ సమావేశం జరగడం తెలిసిందే.

07/09/2017 - 01:50

బీజింగ్, జూలై 8: భారత్‌లో పర్యటించే చైనా పౌరులు వ్యక్తిగత భద్రతకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది. అయితే ఇది కేవలం సూచన మాత్రమేనని హెచ్చరిక కాదని పేర్కొంది. భారత్‌లో పర్యటించే చైనీయులు అక్కడ నెలకొని ఉన్న పరిస్థితులు, వ్యక్తిగత భద్రత విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

07/09/2017 - 01:13

ఐక్యరాజ్య సమితి, జూలై 8: అణ్వస్త్రాలను నిషేధించడానికి ఉద్దేశించిన మొట్టమొదటి అంతర్జాతీయ ఒప్పందానికి ఐక్యరాజ్య సమితిలోని 120కి పైగా సభ్యదేశాలు ఆమోదం తెలిపాయి. అయితే భారత్‌తో పాటుగా అమెరికా, చైనా, పాకిస్తాన్‌లాంటి పలు అణ్వస్త్ర దేశాలు నిషేధానికి ఉద్దేశించిన చట్టబద్ధ ఒడంబడికపై జరిగిన చర్చలను బహిష్కరించాయి.

07/09/2017 - 01:07

హాంబర్గ్, జూలై 8: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అమెరికా మినహా 18 సంపన్న దేశాలతో భారత్ గొంతు కలిపింది. భూతాపాన్ని తగ్గించేందుకు 190 దేశాలు ఆమోదించిన పారిస్ ఒప్పందాన్ని అమలు చేసే విషయంలో ఎంతమాత్రం వెనక్కి తగ్గేది లేదని రెండు రోజులపాటు ఇక్కడ జరిగిన జి-20 సదస్సు విస్పష్టంగా తీర్మానం చేసింది. దీనిపై ఇక ఎలాంటి పునస్సమీక్ష ఉండబోదని కూడా నిర్ణయించింది.

07/08/2017 - 02:17

హాంబర్గ్, జూలై 7: ఉగ్రవాదంపై యుద్ధానికి బ్రిక్స్ దేశాధినేతలు కలిసి రావాలని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం అంతానికి, బ్రిక్స్ దేశాల ఆర్థికాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జి-20 దేశాల సమావేశానికి హాజరయ్యేందుకు ఇక్కడకు వచ్చిన ప్రధాని మోదీ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాధినేతలతో జరిగిన అనధికారిక సమావేశంలో మాట్లాడారు.

Pages