S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

04/25/2017 - 07:58

పారిస్, ఏప్రిల్ 24:ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల తొలి దఫా ఓటింగ్‌లో ప్రజలు సంప్రదాయ పార్టీలను ఘోరంగా దెబ్బతీశారు. కొన్ని దశాబ్దాలుగా అధికారాన్ని పంచుకుంటూ వచ్చిన లెఫ్ట్, రైట్ పార్టీలను పక్కన పెట్టి ఐరోపా అనుకూల ఇమాన్యుయెల్ మాక్రన్‌కు మొదటి స్థానాన్ని, ఇమిగ్రేషన్ వ్యతిరేక నేషనల్ ఫ్రంట్ నాయకురాలు లీపెన్‌కు రెండోస్థానాన్ని కట్టబెట్టారు.

04/23/2017 - 03:22

వాషింగ్టన్, ఏప్రిల్ 22: అమెరికాలో అత్యున్నత వైద్య పదవి అయిన సర్జన్ జనరల్ పదవినుంచి భారత సంతతి వైద్యుడు వివేక్ మూర్తిని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. తన వాళ్లను ఆ పదవిలో నియమించుకోవడానికి ట్రంప్ వివేక్ మూర్తిని ఆ పదవినుంచి తప్పించారు. 39 ఏళ్ల వివేక్ మూర్తిని నాలుగేళ్ల కాలానికి ఒబామా ప్రభుత్వం సర్జన్ జనరల్‌గా నియమించింది.

04/23/2017 - 03:18

వాషింగ్టన్, ఏప్రిల్ 22: అమెరికాలో అత్యున్నత వైద్య పదవి అయిన సర్జన్ జనరల్ పదవినుంచి భారత సంతతి వైద్యుడు వివేక్ మూర్తిని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. తన వాళ్లను ఆ పదవిలో నియమించుకోవడానికి ట్రంప్ వివేక్ మూర్తిని ఆ పదవినుంచి తప్పించారు. 39 ఏళ్ల వివేక్ మూర్తిని నాలుగేళ్ల కాలానికి ఒబామా ప్రభుత్వం సర్జన్ జనరల్‌గా నియమించింది.

04/23/2017 - 03:24

వాషింగ్టన్, ఏప్రిల్ 22: పదవి చేపట్టిన వంద రోజులకు ముందే తన ఎన్నికల హామీలన్నిటినీ అమలు చేయాలనే అత్రుతతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడానికి, పన్నుల విధానాన్ని సరళీకృతం చేయడానికి, అలాగే విదేశాలకు తరలిపోతున్న ఉద్యోగాలను తిరిగి అమెరికాకు తీసుకురావడానికి ఉద్దేశించిన మూడు కార్యనిర్వాహక ఉత్తర్వులపై శుక్రవారం సంతకం చేశారు.

04/23/2017 - 02:27

వాషింగ్టన్, ఏప్రిల్ 22: భారత్, అమెరికా సంబంధాలు ఎంతో పరిపక్వమైనవని, ఇరు దేశాల్లో ప్రభుత్వాలు మారినా ఎన్నో దశాబ్దాల నుంచి అవి బలపడుతూనే ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.

04/23/2017 - 02:01

కాబూల్, ఏప్రిల్ 22: ఆఫ్గనిస్తాన్‌లోని ఓ సైనిక స్థావరంపై తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 140 మంది సైనికులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఉత్తర ఆఫ్గనిస్తాన్‌లోని మఝర్ ఇ షరీఫ్ నగర శివార్లలోని సైనిక స్థావరంపై శుక్రవారం దాడి జరిగినట్టు రక్షణశాఖ ధృవీకరించింది. సైనిక దుస్తులు ధరించిన తాలిబన్లు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారని, కనీసం 140 మంది సైనికులు మరణించినట్టు వెల్లడించింది.

04/22/2017 - 03:27

వాషింగ్టన్, ఏప్రిల్ 21: అమెరికాలో హెచ్-1బి వీసా నిబంధనలను కఠినతరం చేయాలన్న ట్రంప్ సర్కారు నిర్ణయంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం పట్ల భారత్‌కు గల అభ్యంతరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అమెరికా వాణిజ్య శాఖ మంత్రి విల్బర్స్ రాస్‌కు వివరించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భారత వృత్తి నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని జైట్లీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

04/22/2017 - 01:52

బీజింగ్, ఏప్రిల్ 21: టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించడంపై చైనా మరోసారి మండిపడింది. దలైలామా పర్యటనకు ప్రతిగా అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు పట్టణాల పేర్లను మార్చిన చైనా అలా పట్టణాల పేర్లను మార్చే చట్టపరమైన హక్కు తనకు ఉందని స్పష్టం చేసింది.

04/21/2017 - 03:08

ఇస్లామాబాద్, ఏప్రిల్ 20: పనామా పేపర్ లీక్స్ వ్యవహారంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అనర్హత వేటునుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి వారం రోజుల్లోగా ఒక సంయుక్త దర్యాప్తు బృందం (జెఐటి)ని ఏర్పాటు చేయాలని అయిదుగురు న్యాయమూర్తుల పాకిస్తాన్ సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఆదేశించింది.

04/21/2017 - 03:02

న్యూయార్క్, ఏప్రిల్ 20: ‘టైమ్’ పత్రిక ప్రతి ఏటా ప్రచురించే వందమంది ప్రభావశీల వ్యక్తుల జాబితాలో మన దేశంనుంచి ప్రధాని నరేంద్ర మోదీ, పేటిఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మలకు స్థానం లభించింది. టైమ్ మ్యాగజైన్ గురువారం ఈ జాబితాను విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటీష్ ప్రధాని థెరెసా మే తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

Pages