-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
వాషింగ్టన్, ఫిబ్రవరి 18: ఉగ్రవాదాన్ని ప్రతిఘటించాల్సిందేనని, ఉగ్రవాదులను ఓడించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ లక్ష్యాలను తమ ప్రభుత్వం సాధించగలదన్న నమ్మకం తనకుందని ఆయన స్పష్టం చేశారు. ‘ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అందరికీ ముప్పే.
ఇస్లామాబాద్, ఫిబ్రవరి 18: పాకిస్తాన్లో హిందూ వివాహాల నియంత్రణ బిల్లు చట్టంగా మారేందుకు రంగం సిద్ధమైంది. దీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్న ఈ చరిత్రాత్మక బిల్లును పాక్ సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. పాక్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్ దిగువ సభ) 2015 సెప్టెంబర్ 26నే ఆమోదించిన ఈ బిల్లు ఇక చట్టంగా మారాలంటే దానిపై ఆ దేశ అధ్యక్షుడు లాంఛనంగా సంతకం చేస్తే సరిపోతుంది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ప్రపంచంలోనే అతిపెద్ద ఊబకాయురాలయిన ఎమన్ అహ్మద్ ఇక్కడి సైఫీ ఆసుపత్రిలో బరువు తగ్గే చికిత్స తీసుకుంటున్న కారణంగా కేవలం అయిదు రోజుల్లో 30 కిలోల బరువు తగ్గారు. 500 కిలోల బరువు కలిగిన ఈజిప్టుకు చెందిన ఎమన్ ఈ చికిత్స కోసం కొద్ది రోజుల క్రితం ప్రత్యేక విమానంలో ఇక్కడికి వచ్చిన విషయం తెలిసిందే. ఎమన్ స్థూలకాయాన్ని తగ్గించడానికి ఆమెకు త్వరలో బేరియాట్రిక్ సర్జరీ చేయనున్నారు.
బీజింగ్, ఫిబ్రవరి 17: జైష్ ఎ మొహమ్మద్ (జెఇఎం) చీఫ్ మసూద్ అజర్పై ఐక్యరాజ్య సమితి (ఐరాస) చేత నిషేధం విధింపచేయడానికి భారత్ చేస్తున్న కృషికి తాను మద్దతు ఇవ్వాలంటే, అతనికి వ్యతిరేకంగా ఉన్న ‘గట్టి ఆధారాల’ను తనకు అందజేయాలని చైనా సూచించింది. భారత్, చైనాల మధ్య త్వరలో వ్యూహాత్మక చర్చలు జరుగనున్న తరుణంలో చైనా మసూద్కు వ్యతిరేకంగా ఆధారాలు అడగటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇస్లామాబాద్, ఫిబ్రవరి 17: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడిన మరుసటి రోజే పాకిస్తాన్ భద్రతా బలగాలు శుక్రవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన అణచివేత చర్యల్లో 39 మంది మిలిటెంట్లను హతమార్చాయి. సింధ్ రాష్ట్రంలో గురువారం ఐఎస్ ఆత్మాహుతి బాంబర్ చేసిన దాడిలో 80 మంది మృతి చెందగా, సుమారు 250 మంది గాయపడిన విషయం తెలిసిందే.
లండన్, ఫిబ్రవరి 17: పాకిస్తాన్.. తెగలు, రాజకీయాలు, జాతుల ఆధారంగా నిప్పు రాజేస్తోంది. ముఖ్యంగా కరాచీ నగరం భారత వ్యతిరేక జిహాదిస్టులకు కేంద్రంగా అవతరించింది. యూరప్కు చెందిన ప్రధాన సంస్థల్లో ఒకటయిన ‘ద ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్’ తన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడించింది.
వాషింగ్టన్, ఫిబ్రవరి 17: అమెరికాలోకి ఏడు ముస్లిం దేశాల వలసల నిరోధం విషయంలో రాజీలేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించాడు. తొలి ఉత్తర్వు వివాదాస్పదం కావడంతో.. మరో కార్యనిర్వాహక ఉత్తర్వుకు పదునుపెడుతున్నామన్నారు. వచ్చేవారమే దీన్ని జారీ చేయడం ఖాయమని వెల్లడించారు. ‘అమెరికాకు వలసల నిషేధంపై కొత్తగా రూపొందించనున్న ఉత్తర్వులను లోతుగా, గట్టిగా అధ్యయనం చేస్తున్నాం.
వాషింగ్టన్, ఫిబ్రవరి 16: ఇరాన్ అణ్వస్త్రాన్ని తయారుచేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతాన్యాహుతో భేటీ అయన ఆయన ఇరాన్ అణు చర్యలనుంచి ఇజ్రాయెల్కు ముప్పు పొంచి ఉందని అన్నారు. అణ్వస్త్రాన్ని అభివృద్ధి చేసే ఏ చర్యను కూడా ఇరాన్ చేపట్టకుండా నిరోధిస్తామని పేర్కొన్నారు.
కరాచి, ఫిబ్రవరి 16: పాకిస్తాన్లోని ఓ సూఫీ మసీదు రక్తసిక్తమైంది. కారు బాంబర్ జరిపిన ఆత్మాహుతి దాడిలో వందమందికి పైగా మరణించారు. మరో వందమంది తీవ్రంగా గాయపడ్డారు. కరాచీకి 200 కి.మీ దూరంలో సెహ్వాన్లో గల సూఫీ లాల్ షాబాజ్ ఖళందర్ మసీదులో ఈ ఘాతుకం జరిగింది. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసిస్ ప్రకటించింది. ఈ మసీదు గోల్డెన్ గేట్ ద్వారా ఆత్మాహుతి బాంబర్ లోపలికి ప్రవేశించాడు.
బీజింగ్, ఫిబ్రవరి 16: ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపించి ప్రపంచ రికార్డు సృష్టించిన ఇస్రో భారతీయులందరినీ గర్వపడేలా చేసిందని చైనా అధికారిక మీడియా పేర్కొంది. భారత అంతరిక్ష కార్యక్రమం ఇతర దేశాల ఆలోచనలకు ఆహారాన్ని అందించిందని గ్లోబల్ టైమ్స్ పత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది.