-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
లెబనాన్: ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ట్రక్కుదాడి జరిపి 84 మంది ప్రాణాలను బలిగొన్నది తామేనని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని ఉగ్రవాదుల వార్తా సంస్థ అమఖ్ శనివారం ప్రకటించింది. ట్రక్కు డ్రైవర్ తమ సంస్థలో సుశిక్షితుడైన సైనికుడని, తమను అంతం చేస్తామని సంకీర్ణదేశాలు ప్రకటించిన నేపథ్యంలో తాము నీస్లో దాడికి పాల్పడ్డామని ఐసిస్ స్పష్టం చేసింది.
ఢిల్లీ: టర్కీలోని భారతీయులంతా క్షేమంగా ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్కు 1100కి.మీ. దూరంలోని టాబ్జాన్ నగరంలో వల్డ్ స్కూల్ ఛాంపియన్షిప్ పోటీ పాల్గొనేందుకు 38మంది అధికారులతో కలిసి 148మంది భారతీయ చిన్నారులు టాబ్జాన్ వెళ్లారు. టర్కీలో సైనిక తిరుగుబాటు నేపధ్యంలో టర్కీలో ఉన్న భారతీయుల గురించి ఆందోళన వద్దని సుష్మా అన్నారు.
అంకారా: టర్కీ సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటు చేయడంతో పోలీసులు, సైనికులకు మధ్య జరిగిన కాల్పుల్లో 190మందికి పైగా మృతిచెందినట్లు టర్కీ తాత్కాలిక ఆర్మీ చీఫ్ ఉమిత్ దుందర్ చెప్పారు. 1,100 మందికి పైగా గాయపడ్డారు. 1,500 మంది సైనికులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. కాల్పుల్లో 41 మంది పోలీసులు, ఇద్దరు సైనికులు, 47 మంది పౌరులు, 104 మంది తిరుగుబాటు దారులు మృతిచెందినట్లు తెలిపారు.
అబూజా: గతనెల 29న నైజీరియాలో కిడ్నాప్కు గురైన మంగిపూడి శ్రీనివాస్, కౌశల్ అనీష్శర్మ శనివారం ఉదయం క్షేమంగా విడుదలైనట్లు అక్కడి భారత హైకమిషనర్ కార్యాలయం ప్రకటించింది. వీరిని విడుదల చేయాలంటూ ఇటీవల ఎపి సిఎం చంద్రబాబు భారత హైకమిషనర్కు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించడంతో కిడ్నాపర్ల చెర నుంచి శ్రీనివాస్, అనీష్లకు విముక్తి లభించింది.
పారిస్: ఫ్రాన్స్లోని నీస్ నగరంలో మారణకాండకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. జనంపైకి భారీ ట్రక్కును నడిపి 84 మంది మృతికి కారకుడైన డ్రైవర్ను ట్యునీషియా దేశస్థుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్ను పోలీసులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఆ డ్రైవర్ మాజీ భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
కరాచీ: భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమిస్తున్నానంటూ యూ ట్యూబ్లో వీడియో పోస్ట్ చేసి గతంలో సంచలనం సృష్టించిన పాక్ వివాదాస్పద మోడల్ ఖండీల్ బలోచ్ శనివారం దారుణహత్యకు గురైంది. సోషల్ మీడియాలో అశ్లీల ఫొటోలు పెట్టి తమ కుటుంబం పరువు తీసిందన్న ఆగ్రహంతో ఆమెను సొంత అనే్న హతమార్చాడని సమాచారం. టి-20 వరల్డ్ కప్లో కోహ్లీ ఆటను చూసి బలోచ్ మనసుపారేసుకుంది.
అంకారా: టర్కీ సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటు చేసిన నేపథ్యంలో ఆ దేశంలో శుక్రవారం రాత్రి నుంచి సామాజిక మీడియాపై పాలకులు ఆంక్షలు విధించారు. ఫేస్బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్ వంటి సామాజిక మీడియాపై నిషేధం విధించామని అధికారులు తెలిపారు. అయితే, తమ సేవలకు కొంత అంతరాయం కలిగిందని ట్విట్టర్, యూ ట్యూబ్ ప్రతినిధులు చెబుతున్నారు.
ఇస్తాంబుల్: టర్కీ సైన్యంలో ఓ వర్గం చేసిన తిరుగుబాటును ప్రభుత్వం సమర్థంగా తిప్పికొట్టిన అనంతరం తాత్కాలిక ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా జనరల్ ఉమిత్ దుందర్ను నియమించారు. తిరుగుబాటు కారణంగా టర్కీలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. సైన్యంలోని 29 కల్నల్స్, ఐదుగురు ఆర్మీ జనరల్స్ను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.
నీస్ (ఫ్రాన్స్), జూలై 15: ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బిస్టల్ డే రక్తసిక్తమైంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి ఏటేటా జరిగే ఈ జాతీయ దినోత్సవం పెను విషాదంగా మారింది. శుక్రవారం ఫ్రాన్స్ వాహ్యాళి పట్టణమైన నీస్ ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్న సమయంలో ఓ ఉగ్రవాది మృత్యు శకటం దూసుకొచ్చి నరమేధం సృష్టించింది. ఈ విషాద ఘటనలో 84మంది మరణించారు.
నైస్ (ఫ్రాన్స్), జూలై 15: ఫ్రాన్స్లోని నైస్ నగరంలో ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ప్రజలపై జరిగిన ఉగ్రవాద దాడి పట్ల ప్రపంచంలోని వివిధ దేశాల నేతలు దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల బీభత్సకాండను తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్రవాద దాడికి గురయిన ఫ్రాన్స్కు, ఆ దేశ ప్రజానీకానికి సంఘీభావం ప్రకటించారు.