S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/10/2016 - 00:53

బీజింగ్, జూలై 9: చైనా తూర్పు తీరంలో టైఫూన్ కల్లోలం సృష్టించింది. సుమారు 4 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. బలమైన గాలులు, భారీ వర్షాలతో అతలాకుతలమైందని అధికారులు తెలిపారు. టైఫూన్ తీవ్రత దృష్ట్యా ఈ ఏడాది తొలిసారి రెడ్ అలెర్ట్ ప్రకటించారు. చైనా స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 1:45కి ఫుజియన్ ప్రొవిన్స్‌లోని షిషి నగరంలో గాలులు మొదలయ్యాయి.

07/10/2016 - 00:52

కరాచీ, జూలై 9: పాకిస్తాన్‌లో ప్రముఖ సామాజిక కార్యకర్త, ఈదీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అబ్దుల్ సత్తార్ ఈది శుక్రవారం రాత్రి కన్నుమూశారు. 92 ఏళ్ల వయసున్న సత్తార్ ఈది కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పేదలు, అనాథలకు పాతిక సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్నారు. భారతదేశానికి చెందిన మూగ చెవిటి బాలిక గీత పదకొండేళ్ల వయసులో పొరపాటున పాకిస్తాన్‌లో ప్రవేశించినప్పుడు ఈది ఆమెను కాపాడారు.

07/10/2016 - 00:44

లండన్, జూలై 9: యూరోపియన్ యూనియన్ ( ఈయూ) నుంచి వైదొలగాలన్న అంశంపై మరోసారి రెఫరెండం జరపాలన్న డిమాండ్‌ను బ్రిటన్ ప్రభుత్వం శనివారం అధికారికంగా తిరస్కరించింది. సుమారు 41లక్షల మంది సంతకాలతో వచ్చిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. జూన్ 23న జరిగిన రెఫరెండంలో మెజార్టీ ప్రజలు ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాలని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

07/09/2016 - 18:03

హైదరాబాద్‌: కజకిస్థాన్‌, రష్యాలలో పర్యటించేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కజకిస్థాన్‌లో శనివారం స్వాగతం లభించింది. తొలుత అల్మాటీ చేరుకున్న చంద్రబాబు బృందం కోక్‌టోబో పర్యాటక ప్రాంతాన్ని సందర్శించింది.

07/09/2016 - 17:12

డర్బన్: జాతిపిత మహాత్మాగాంధీని నాడు అవమానించిన పీటర్ మ్యారిట్జ్‌బర్గ్ రైల్వేస్టేషన్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం చేరుకున్నారు. మహ్మాత్యాగాంధీ ప్రయాణించిన రైలు మార్గంలో నేడు మోదీ ప్రయాణించారు.1893లో సరిగ్గా ఇక్కడే మహాత్మా గాంధీని తెల్లవారు రైలునుంచి కిందకు తోసేశారు. ఫస్ట్‌క్లాస్ టికెట్ తీసుకుని రైలు ప్రయాణం చేస్తున్న గాంధీని తెల్లవారు కిందకు తోసేశారు.

07/09/2016 - 12:04

కరాచీ : మనదేశానికి చెందిన మూగ బాలిక గీతను అక్కున చేర్చుకొని, ఆమెను పెంచి పెద్ద చేసిన పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు అబ్దుల్ సత్తార్ ఈదీ శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. కిడ్నీ, శ్వాసకోస ఇబ్బందులతో కరాచీలోని సింధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తన స్వగ్రామమైన ఈదీ కేంద్రంగా ఈదీ ఫౌండేషన్‌ను నెలకొల్పి 25 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు.

07/09/2016 - 08:32

జొహెనె్నస్‌బర్గ్, జూలై 8: ప్రపంచానికి అహింసను బోధించిన సత్యాగ్రహానికి దక్షిణాఫ్రికా పుట్టినిల్లని, మోహన్‌దాస్ మహాత్ముడిగా మారింది ఈ గడ్డమీదేనని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మొత్తం దక్షిణాఫ్రికా సమాజాన్ని హిందీ, తెలుగు, తమిళం, గుజరాతీ, ఉర్దూ భాషలు మరింత సుసంపన్నం చేస్తున్నాయని శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఇక్కడ జరిగిన ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.

07/09/2016 - 07:58

ప్రిటోరియా, జూలై 8: భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలాకు ఘన నివాళి అర్పించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వారిని కలుసుకున్నారు. ప్రపంచానికే అహింసా మార్గాన్ని బోధించిన ఈ ఇద్దరు మహా నేతలకు సంబంధించిన ఓ ప్రదర్శనను కూడా ఆయన జోహన్నస్‌బర్గ్‌లో ప్రారంభించారు. వీరిద్దరినీ అప్పటి దక్షిణాఫ్రికా పాలకులు నిర్బంధించిన కాన్‌స్టిట్యూషనల్ హిల్‌ను సందర్శించారు.

07/09/2016 - 07:58

హ్యూస్టన్, జూలై 8: పథకం ప్రకారం పోలీసులను లక్ష్యంగా చేసుకుని అమెరికాలో జరుగుతున్న ఈ దాడులు ఎంతమాత్రం సమర్థనీయం కాదని, అత్యంత హేయమని అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఈ దాడులు అంతటినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఒక ప్రకటనలో అన్నారు. నాటో సమావేశాల్లో పాల్గొనడం కోసం ప్రస్తుతం పోలండ్ రాజధాని వార్సాలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ ఘటనలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

07/09/2016 - 07:57

హ్యూస్టన్, జూలై 8: అమెరికాలో నల్లజాతీయుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. డల్లాస్‌లో పోలీసులపై ఆందోళనకారులు జరిపిన కాల్పుల్లో అయిదుగురు పోలీసు అధికారులు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. గత రెండు రోజుల్లో లూసియానా, మినె్నసోటాల్లో పోలీసులు ఇద్దరు నల్లజాతీయులను కాల్చి చంపడంపై మొదలైన ఆందోళనలు ఇతర రాష్ట్రాలకు కూడా పాకాయి.

Pages