S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

02/20/2018 - 22:10

కురు, పాండవ సంగ్రామానంతరం, కౌరవ రాజు ధృతరాష్ట్రుడు, తన వారందరూ యుద్ధంలో మరణించారని వ్యధజెందాడు. ఆశ్రమ ధర్మాన్ని పాటించి, వానప్రస్థ జీవితం అరణ్యంలో తపస్సు చేసుకుంట కాలం గడపాలని దృఢ సంకల్పంతో వున్నాడు. రాజ్యంలో ప్రజలందరినీ సమావేశపరచాడు. వ్యథతో తన సంకల్పమును వివరించి వారి అనుమతిని ప్రార్థించాడు.

02/18/2018 - 21:54

గొప్ప రాజనీతిజ్ఞునిగా పేర్గాంచినవాడు చాణుక్యుడు. ఇతనికి వేర్వేరు పేర్లు వేర్వేరు పనులు చేసినందున వచ్చి ఉన్నాయి. కాని భారతదేశ చరిత్రలో అర్థశాస్తవ్రేత్తగా, సుభాషిత కర్తగా సాహిత్యంలో ముఖ్యస్థానాన్ని పొంది ఉన్నాడు. ఆధ్యాత్మిక సామాజిక, ఆర్థికాంశాలపై చాణిక్యుని దృక్పథం ఎలా ఉందో మచ్చుకు కొన్ని సూత్రాలను చూద్దాం.
తద్భోజనం యద్ద్విజ భుక్తశేషమ్
తత్‌సౌహృదం యత్‌క్రియతే పరస్మిన్

02/14/2018 - 21:55

ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారిని కూడా కేవలం ఒకే ఒక బలహీనత అధఃపాతాళంలోకి అతి సులువుగా నెట్టివేయగలదు. అటువంటి ఒక భయంకరమైన బలహీనతే పరవ్యామోహం.

02/13/2018 - 21:24

చారిత్రక యుగమున శాతవాహన, చాళుక్య, రాష్టక్రూట, కాకతీయ, ఆనంతర కాలమున హైందవ సంస్కృతీ సభ్యతలకు ఆలవాలమైన తెలుగు నేలలో వివిధ రాజన్యుల ఏలుబడులలో శైవమతం పరిఢవిల్లింది. క్రీ.పూ.2వ శతాబ్ది నాటికే శైవారాధన ఉంది. గాథా సప్తశతిలో గౌరీ, పశుపతి స్తోత్రముంది. 1వ శతాబ్దంలో శైవంలో అత్యంత ప్రాచీనమైన పాశుపత శైవాన్ని లకులీస శివాచార్యుడు స్థాపించారు.

02/12/2018 - 21:07

కన్యగానే చాలా కాలం వున్నది. కొంతకాలానికి తనకు వివాహం కావడంలేదని పరమశివుని గురించి భయంకరమైన తపస్సు చేస్తుండగా ఆమె వద్దకు యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినీ దేవతలు వచ్చి జన్మాంతరంలో తమ తమ అంశాలతో జన్మించేవారికి భార్య కావాలాని కోరుకుంటారు. ఆమె తపస్సుకుమెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మనగా ‘‘నాకు పతిదానం ఇమ్ము’’ అని ఐదుసార్లు అంటుంది.

02/11/2018 - 20:54

భారతీయ సంగీత, ఆధ్యాత్మిక రంగాలకు మకుటంలేని మహారాజు శ్రీ త్యాగరాజు. సంగీత సాహిత్యాలకు ఒజ్జిబంతి శ్రీ త్యాగరాజు. సంగీత సాహిత్యాలతోపాటు భరతమునికి ధీటుగా భారతావనిలో వనె్నకెక్కినవారు ‘సంగీత సాహిత్య సార్వభౌమ’, ‘లయబ్రహ్మ’ పుంభావ సరస్వతికి ప్రతిరూపంగా అవతరించినవారు హరికథా పితామహులు శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారు.

02/09/2018 - 21:07

పుణ్యభూమి యైన మన భారతదేశంలో ప్రతితిథీ ప్రతివారమూ మహనీయమైనదే. ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క దైవాన్ని పూజించడం సంప్రదాయం. మహావిష్ణువు అత్యంత ప్రీతిదాయకమైన తిథి ‘ఏకాదశి’ఈ ‘ఏకాదశి’ మరీ మహత్తరమైంది. ఆరోజున ఉపవాసం ఉండడం, మహావిష్ణువు పూజించడం లాంటివాటిని ఆచరించిస్తే అటు ఆరోగ్యసంపద ఇటు ఆధ్యాత్మిక సంపద ఒనగూడుతాయి అంటారు. సంవత్సరానికి 24ఏకాదశులున్నా ఒక్కొ ఏకాదశి ఒక్కో మహాత్య్మానికి ప్రత్యేకతను పొందింది.

02/08/2018 - 22:10

కుమ్మరి ఇంట్లో ప్రవేశించిన పాండవులు, ద్రౌపది శయనించి ఉండటాన్ని చూస్తాడు దృష్టద్యుమ్నుడు. అలా పరుండిన పాండవులు సేనాధికారుల గురించీ, దివ్యాస్త్రాల గురించి, రథాలు, ఏనుగులు, ఖడ్గాలు మొదలగువాటి గురించి మాట్లాడుకొనటం వింటాడు. వారలా మాట్లాడుకొనటం పాంచాలి కూడా విన్నది. పాండవులు మాట్లాడుకొన్న విషయాలను వినిన దృష్టద్యుమ్నుడు అక్కడనుండి బయలుదేరి తండ్రి వద్దకు వెళ్ళాడు. ద్రుపదుడు విచారంతో ఉన్నాడు.

02/07/2018 - 21:08

ద్రౌపది సమేతులై కుమ్మరి ఇంటికి వెళుచున్న భీమార్జులను, తండ్రి ఆజ్ఞ మేరకు దృష్టద్యుమ్నుడు వారి వెనుక నుండి వారిని అనుసరించాడు. భీమార్జునులకు తెలియకుండా సేవకులను అంతా నియమించాడు.
దృష్టద్యుమ్నుడు భార్గవుని ఇంటి వద్ద అజ్ఞాతంగా ఉన్నాడు. పాండవుల గురించి గోప్యంగా వివరాలను సేకరిస్తున్నాడు.
సాయం సమయం అయింది. భీమార్జున నకుల సహదేవులు భిక్షాటనం కోసమై బయలుదేరి వెళ్ళారు.

02/06/2018 - 22:01

ఇటువంటి సేవ మనకెందైనా గలుగునా
పటుతరమైన రాఘవ ప్రభు సన్నిథి నే గాక
తేటకస్తురి నుదట - నీటు గులుకు చుండ
హాటకాంబరుడైన శ్రీ- హరి సభయందునె గాక
ఆడుచు నాదమున - బాడుచు నెదుటను
వేడుచు నామది - గూడి యుండుటె చాలు
వాసిగ భద్రశైల - వాసుని దాసాను
దాసుడౌ నరసింహ - దాసావనుని గనకున్న
దాసుడే నరసింహ - దాసావనుని గనకున్నా....

Pages