S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

10/29/2018 - 22:49

తన వ్రాయు గంటంబు మొనవాడి విశ్వంభరా ప్రజల ప్రాణ రక్షగాగ....’’ అని అంటాడొకచోట తెనాలి రామకృష్ణుడు. ఒక క్షణం ఆ చెప్పిన వాక్య విన్యాస తాత్పర్యంలోకి అడుగుపెడితే నంది తిమ్మన చెప్పినట్లు ‘మృదు గీతికా పరిణత ధ్వని వైఖరి’ కనిపిస్తుంది మనకు. అచ్చ కవిత్వపు మేలు వెనె్నల వెల్లపచ్చడం విచ్చిన అంబర శయ్యమీద ఉన్నామా... అని కూడా అనిపిస్తుంది.

10/22/2018 - 06:31

కవిత మనిషితో పాటే పుట్టి ఉంటుంది. మనిషితో పాటే కవిత కదులుతూ వస్తోంది. మనిషి కవితను కదిలిస్తున్నాడు. కవిత మనిషిని కదిలిస్తోంది. మనిషికీ కవితకూ పోలిక కదలిక. అందుకే శ్రీశ్రీ ‘‘కదిలేదీ, కదిలించేదీ’’ అంటూ కవితా ప్రస్తావన చేశారేమో? మనిషి ఉన్నన్నాళ్లూ కవిత ఉంటుంది. కవిత ఉన్నన్నాళ్లూ మనిషి ఉంటాడు. మనిషి, కవిత లేకపోవడం ఉండదేమో?
=====================================

10/15/2018 - 06:55

తిరుమల కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధికెక్కింది. దాదాపు రెండువేల సంవత్సరాల నుండి సాహిత్యంలో, శాసనాల్లో తిరుమల క్షేత్ర వైభవం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో సంవత్సరం పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, పండుగలు భక్తులను నిరంతరం తన్మయత్వం చేస్తూనే ఉంటాయి. అక్కడ జరిగే అన్ని వేడుకల్లో ప్రధానమైనవి బ్రహ్మోత్సవాలు.

10/01/2018 - 00:01

ఏది తేలిక మార్గమో దాన్ని ఎంచుకొని దాన్ని తరించడానికి ఏర్పరుచుకున్న నేపథ్యాన్ని అనివార్య ప్రయోజకత్వంగా విశే్లషించుకొని బ్రతుకు సాగించటం స్వేచ్ఛా నాగరికతయొక్క వౌలిక స్వభావం. దీన్ని పరివ్యాప్తి చేయటంకోసమే కలాన్ని కంకణంగా ధరిస్తారు. తమనే వివిధ పాత్రలుగా మలచుకుంటారు. తమకనుకూలమైన తర్క వ్యాకరణ సంధి సూత్రాలతో తమని సమర్ధించుకుంటానికి (అ)పూర్వ రంగాన్ని ఏర్పరచుకుంటారు.

09/24/2018 - 04:39

కవికోకిల బిరుదాంకితులు.. కవితా విశారదులు.. విశ్వకవి సామ్రాట్.. మధుర శ్రీనాధ బిరుదాంకితులు.. కళాప్రపూర్ణులు అయన గుఱ్ఱం జాషువా పేరెన్నికగన్న పద్య సాహితీ దురంధరులు. ఆధునికాంధ్ర సాహిత్య రంగంలో తొలి తరం కవుల్లో పలువిధాల విలక్షణంగా ప్రసన్నమయ్యే మహనీయమూర్తి. రాపిడిపడ్డ జీవితంలో గుబాళించిన కవితా ప్రతిభతో రాణించిన కవి దిగ్గజుడు. పలు ఖండికలు రచించిన కవి దిగ్గజుడు.

09/16/2018 - 23:36

***గురజాడ రాసిన కన్యాశుల్కం ఆధునిక తెలుగు సాహిత్యంలోనేకాక, నాటక ప్రక్రియలోనూ పెనుమార్పులకు కారణం అయింది. ఈ నాటకం తెలుగు సాహిత్యంలో చెప్పలేనంత సంచలనాత్మకమైన విప్లవం తెచ్చింది. ఈ నాటకం మీద వచ్చినంత విమర్శ, ప్రతివిమర్శలు మరి ఏ నాటకం మీద, ఇతర గ్రంథం మీద కూడా రాలేదు. అంతేకాదు ఒక రచయిత రాసిన ఒక గ్రంథం మీద ఇన్ని వేల పేజీల విమర్శ కూడా రాలేదు. ఇది గొప్పేకాదు, ఒక రికార్డు కూడా.

09/10/2018 - 01:32

నాగసూరి వేణుగోపాల్!.. ఈ పేరు వింటే పాపులర్ సైన్స్ రచనలు, టి.వి. ముచ్చట్లు, ఛానళ్ళ హోరుపై విశే్లషణలు, పర్యావరణ సమస్యలపై చైతన్యపూరిత రచనలు గుర్తొస్తాయి. ఆకాశవాణిలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ నుండి తిరుపతి ఆకాశవాణి కేంద్రం స్టేషన్ డైరెక్టర్ స్థాయి వరకు అంచలంచెలుగా ఎదుగుతూ, ఒదుగుతూ...

09/02/2018 - 23:37

తన కాలంలోని సాహిత్యాన్ని ప్రజాపరం చేసిన ప్రజాకవి డా. అద్దేపల్లి. ఎందరో సమకాలీనులకు- కవిగా, విమర్శకునిగా, సమీక్షకునిగా సభా సంచలనాల్లో సాహితీయోధునిగా గణుతికెక్కారు. కవిత్వ ప్రాధాన్యతలలో ఎదుటివారి విలువలను సున్నితంగా, సుతిమెత్తగా విమర్శించే నైజం ప్రదర్శించే అరుదైన వారిలో అరుదైనవారు అద్దేపల్లి. ఒక రకంగా కవిత్వం వక్తృత్వంల మేలు కలయిక అద్దేపల్లిలో కన్పిస్తుంది.

08/26/2018 - 22:13

తెలుగులో మనకు హైకు, రుబారుూ, గజల్, సానెట్, లిమరిక్, ఏక పంక్తి, కత్‌అ, ఎపిటాఫ్ వంటి విదేశీ కవితా ప్రక్రియలు కనిపిస్తు న్నాయి. ఈ విదేశీ కవితా ప్రక్రియలలో హైకు దాదాపుగా ఒక విఫల ప్రక్రియ అయింది తెలుగులో. నిజానికి హైకు అందం, శిల్పం, గొప్ప తనం తెలుగుకు తెలియరాలేదు. తెలుగులో ఏకపంక్తి కవిత, గజల్, ప్రక్రి యలు చలామణిలో ఉన్నాయి. రుబాయి ఉంది అన్న స్థితిలో ఉంది.

08/20/2018 - 19:27

‘‘పాము కోర డేగ రెక్క ఈ కాలానికి చిహ్నం-
పూల తేనె నెమలి రెక్క ఒక మిథ్యా ప్రమాణం’’

Pages