S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వినమరుగైన
తెలిసిన తరువాత ఆ సౌందర్యం, ఆ స్నేహం- ఆ లాలన అతని దగ్గిర్నించి పొందిన తరువాత- ఎన్ని కష్టాలు పడినా రాజేశ్వరి చలించలేదు. అమర్ను కోపగించుకుందేగాని ఏవగించుకోలేదు. డబ్బు, భద్రత, సాంఘిక హోదా- అన్నింటినీ కాలిగోటితో తన్ని వచ్చిన రాజేశ్వరి, ఏ బలవంతపు పరిస్థితులవల్లనో అమర్ కోరిన స్ర్తిని పతివ్రత వలె అతనికి తెచ్చి ఇవ్వవలసిన అవసరం లేదు.
అవిద్య, అజ్ఞానం, కరడుకట్టిన సంప్రదాయవాదం నేపథ్యంలో తన రచనలలో ఆంధ్రదేశాన్ని ఊపిరాడనీయక భయపెట్టినవాడు చలం. సత్యాన్ని ఎదుర్కొనడానికి భయపడిన తమను సహజమైన రీతిలో వ్యాఖ్యానించి వెలివేశారు. సత్యం చెప్పడానికి భయపడని చలం సమాజానే్న వెలివేశాడు. చలం ఒక్కొక్క రచన సమాజం వీపుమీద ఒక్కొక్క కొరడా దెబ్బ. అయితే మైదానం నవల ఒక పిడుగు.
ఆనాటి సాంఘిక రాజకీయ పరిస్థితులను కూడా చిత్రించి మొక్కపాటి వారు గ్రంథ గౌరవం పెంచారు. చివరిగా ఒక్కమాట. ప్రథమభాగంలో పార్వతీశం అనామకుడు. కాని రెండు మూడు భాగాల్లో రచయిత పార్వతీశంలో కొంత ప్రవేశించాడనిపిస్తుంది. మొదటిభాగంలో, పార్వతీశం తండ్రిని అనాగరికుడుగా, చదువురానివాడుగా, వ్యవసాయదారునిగా చిత్రించిన రచయిత మూడవ భాగంలో ఆ పాత్రను ప్రాజ్ఞునిగా, సంస్కారవంతునిగా మార్చాడు.
మన పార్వతీశం లిఫ్టు ఎక్కి, అది ఒక గది అనుకొని అది పైకి పోతుంటే గంగారుపడ్డాడు. ఇలా చాలా చిన్న విషయాలను తీసుకొని హాస్యరసస్ఫోరకంగా అందించారు శాస్ర్తీగారు. పార్వతీశానికే గాదు క్రొత్త ప్రదేశానికి వెళ్లిన ప్రతివారికి ఏవో కొన్ని ఇలాంటి అనుభవాలు తప్పవు. బారిష్టరు పార్వతీశం రెండవ భాగంలో హాస్యంతోపాటు కొంత శృంగారం కూడా జోడించారు మొక్కపాటివారు.
నిత్య జీవితంలో అందునా స్వస్థానం మారినపుడు ఎదురయ్యే ఎన్నో విషయాలను ఎలా చమత్కారంగా చెప్పవచ్చో ఈ గ్రంథం చదివితే తెలుస్తుంది. శాస్ర్తీగారు మొదటిభాగం పీఠికలో నౌకాయానాన్ని అనేక హాస్య సంఘటనలతో, సన్నివేశాలతో కథలు కథలుగా వర్ణించిన డబ్ల్యు.డబ్ల్యు.జేకబు ప్రస్తావన తెచ్చారు. దీన్ని బట్టి ఆ ఆంగ్ల రచన శాస్ర్తీగారి రచనకు ప్రేరణ అని భావించవచ్చు.
మొదటి భాగం వచ్చిన నలభై సంవత్సరాలకు నార్ల వెంకటేశ్వరరావుగారు, దాన్ని ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురిస్తూ మిగిలిన నాలుగు భాగాలు వ్రాయమని ప్రోత్సహించారు. మొక్కపాటివారు చెప్పగా కప్పగంతు రాజేశ్వరి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మలు లేఖకులుగా మిగిలిన రెండు భాగాలు పూర్తయినాయి. 1971ల మూడు భాగాలు ముద్రింపబడ్డాయి.
ఆధునిక వచన వాఙ్మయంపైన ఏ మాత్రం దృష్టి కలిగిన వారికైనా బారిష్టరు పార్వతీశం కనపడకపోడు. అతడు తన హాస్యం చేత అందర్నీ నవ్విస్తూ మిగిలిన ప్రతిభా విశేషాలవల్ల ఆలోచనాపరుల్ని ఆశ్చర్యపరుస్తూ, ఆంధ్ర సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయాడు. ఈ పార్వతీశం తన సృష్టికర్త మొక్కపాటి నరసింహశాస్ర్తీగారినే మించిపోయాడు. రచయితలకు వారి పాత్రలకు వుండే సంబంధాలు చాలా చిత్రంగా ఉంటాయి.
మొదటిసారి జైలుశిక్షననుభవిస్తున్న కాలానికే పాలకుల విధానాలు ఏవిధంగా సామాన్య జనులను నేర ప్రవృత్తికి మరలుస్తున్నాయోచూశారు. స్వరాజ్యం వస్తేగాని సెటిల్మెంట్లు, జైళ్లు బాగుపడే అవకాశం లేదని భావించారు. భూస్వామ్య వ్యవస్థలో శ్రామిక జనుల శ్రమకు సరియన గిట్టుబాటు లభింపకపోవటం, కాలగతిలో కుల వ్యవస్థలో ఏర్పడిన దోషాలు ఆయన గుండెను కదలించివేశాయి.
ఈ శతాబ్దపు తొలి నాళ్లలో తెలుగు భాషకు ప్రజలకు విశిష్ట సేవ లందించిన ప్రముఖులలో ఉన్నవ లక్ష్మీనారాయణ గారొకరు. ఆంధ్రాభ్యుదయాన్ని కాంక్షించినవారి గుండె లోతుల నుండి పెల్లుబికి వచ్చిన అక్షర రూపం సంతరించుకొన్న నవల మాలపల్లి. ‘‘కవయఃక్రాంతదర్శినః’’ అన్నారు నవల వ్రాసినవారిని కవి అనటం సంప్రదాయం కాదుగాని ఉన్నవవారు వ్రాసిన నవలలో క్రాంతదర్శన లక్షణం పరిపుష్టంగా కనిపిస్తుంది.
ఒక ఇంటి యజమాని వీళ్ల కోరికని విని ‘అలాగే’నని కార్యక్రమం ముగిశాక వంటవారి చేత గణపతి కొల్లాయి గుడ్డతోనే పందిరి మంచపుకోడుకు కట్టించి ఈత చువ్వతో సన్మానం చేస్తాడు.