S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సుమధుర రామాయణం
1346. వేకువనె విప్రశ్రేష్టుల వెంట గురుడు
వచ్చి జానకీ రాముల దివ్యమణుల
చే ప్రకాశించు పసిడి సింహాసనమున
గూర్చొనగబెట్టి వేదమంత్రములు జెలగ
1347. నదనదీ సాగర పవిత్రోదకము తోడ
మంత్రులెనమండుగురు రామచంద్ర విభుని
వసువులు సురపతి నభిషేకించునట్లు
మోదమున నిష్టగ నభిషేకమ్మొనర్చి
1326. భరత డానతివ్వ శతృఘు్నడన్న రామ
చంద్రుని స్వాగతించ నయోధ్యపురిని
సర్వశోభాయమానముగా నలంకృ
తమ్ము జేయించి దేవాలయమ్ము లందు
1327. దానములను విశేష పూజలను సల్ప
జెప్పి నంది గ్రామము నుండయోధ్యకేగు
మార్గము పతాక తోరణములను గట్టి
సర్వ సుందరమ్ముగను జేయించె నపుడు
1306. మనము సౌమిత్రితో నున్న పర్ణశాల
ఇదియె జనకజా! కిష్కింధ జూడు మిదిగా
ఇచ్చటనె సుగ్రీవునితొ సఖ్యమ్ము గల్గె
వాలి నిహతుడైన ప్రదేశమ్ము నిదియె
1307. అపుడు వైదేహి భర్తతో ‘‘రామచంద్ర!
తార యితర వానర వనితలతొ మనము
యేగుద మయోధ్యకనగ సుగ్రీవునాజ్ఞ
తారతో పుష్పకమెక్కి, రందరపుడు
1286. త్రికరణమ్ముల నినె్న ధ్యానించు నీమె
వనితలందున రత్న మీవసుధపుత్రి
యనుచు సీతను స్వర్ణ పద్మాసనమున
దెచ్చి రాముని కర్పించె హుతవహుండు
1287. రాముడంతటి బ్రహ్మరుద్రాది దేవ
తలకు వందనములిడి త్రిలోక వంద్యు
లార! జానకి కల్మషరహిత యంచు
నేనెరుంగుదు జగములు నమ్ముకొరకు
1266. మాత రుూ క్రూర రాక్షాస స్ర్తిలు మిమ్ము
యెంతొ బాధపెట్టిరి యనుమతిని యిమ్ము
నందర నిపుడె క్షోభింపజేతుననగ
వలదు హనుమ రాజాజ్ఞకు వశులు వీరు
1267. వీరి దోషమేమియు లేదు వీరిని క్ష
మించితి పవనాత్మజ రామచంద్రువేగ
జూడ గోరుచుంటినటంచు దెల్పుమయ్య
ఆ స్వజనరక్షాపర దురంధరున కనక
1246. ‘‘దశరధాత్మజ! సర్వజ్ఞ! రుూతడు వర
బలుడుగాన నజాస్తమ్రు వలనగాని
హతుడుగాడు విడువుము బ్రహ్మాస్తమ్రున్న
మాతలి పలుకులకు రామచంద్రమూర్తి
1247. తనకగస్త్య ముని ప్రసాదించి నట్టి
దివ్యచాపము కోదండమున్ ధరించి
వైరిమర్మఛేదనకరవౌ విరించి
యస్త్ర సంధానముంజేసి వదలు వేళ
1226. ఓషధీ నిలయమ్ము ద్రోణాద్రి దెచ్చి
ముందునుంచ సుషేణు డౌషధుల లక్ష్మ
ణునకు వాసనజూప చైతన్యవంతు
డై కనులు విప్పె నూతన కాంతితోడ
1227. తమ్మునక్కున జేర్చి దాశరధి పులక
గాత్రుడయ్యె వానరులు సంతోష చిత్తు
లై జయ నినాదములతోడ గంతులిడిరి
రామ కోపాగ్ని వైరిపై ప్రజ్వలించె
1206. అష్టహరులను బూన్చిన రధమునెక్కి
దుందుభి ధ్వానముల దిక్కులదురుచుండ
గ్రీష్మభానునివలె నరుదెంచుచున్న
నా మహావీరు లంకాదినాధుజూచి
1207. గుండియలుజార హరిసేన కంపమొందె
నలుడు నీలుడు తారులుబూని వారి
ధైర్యవంతులజేసి రారంభమయ్యె
తుములు సమరము యిరుపక్షములకు నపుడు
1186. వారుణాస్తమ్రుతో దాని వెనుక కంపి
ఐంద్రనామకాస్తమ్మ్రును ధనువు నందు
గూర్చి రాముడు ధర్మ విగ్రహుడు సత్య
సంధుడైన రుూ యస్తమ్రు నితనిగూల్చు
1187. ననుచు విడిచె యస్తమ్రును రామానుజుండు
తీవ్రవేగముతోనది వజ్రమకుట
కుండ లాలంకృతమ్మగు మేఘనాధు
శిరము ఖండించి భూమిపై జేర్చెనంత
1166. హనుమ జూచి యాశ్చర్యఖేదముల తోడ
భండనం బాపె నిజముగ పుడమి తనయ
నే ఖలుడు జంపె నన్న నిస్పృహను జెందె
యసురులానంద నాట్యముల్ సల్పుచుండ
1167. ఇదియె యదనని ఇంద్రజిత్తురిగె హోమ
కార్యమును నిర్వహింప నికుంభిలకును
యసుర వీరుల కాపుంచి యగ్నివ్రేల్చి
మొదలు బెట్టె హోమము శత్రుమర్ధనకును