S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
భక్తి కథలు
అప్పులు చేసి పుణ్యక్షేత్రాలు తిరగనవసరంలేదు. అప్పులు చేసి దానాలు చేయనక్కర్లేదు. ఏది మనం త్యాగమో దానమో చేయగలిగి ఉంటే దాన్ని చేస్తే చాలు అని చెప్పారు. అతడు ఒక్కసారిగా ఈ మాటలు విని అవాక్కు అయినట్లుగా నిలబడ్డాడు. కనుల నిండా నీరు కారిపోతుండగా వచ్చి బాబా పాదాలపై పడ్డాడు.
వెంటనే ఆయన మూడు కిలోల మిఠాయిని కొని ముగ్గురూ కలసి మసీదు వెళ్లారు.
వీళ్లు వచ్చీ రాగానే ఆ గోవింద్రాజును బాబా పేరు పెట్టి పిలిచాడు. ఇదంతా ఆ ప్రశ్నల మహిమనే అనుకుని గోవింద్ సంతోషంతో బాబా దగ్గరకు వెళ్లాడు. ఓ ప్రసాద్ ఇలా రా.. ఇదిగో ఈ మూడు కిలోల స్వీట్లు నీవే తినేసేయ్, ఇంకా కావాలంటే ఆ మూర్తికి కూడా పెట్టు చాలు. ఇక ఎవరికీ ఏమీ ఇవ్వక్కర్లేదు అని అన్నాడు.
బాబా నవ్వుతూ ‘‘నాలుగు రోజులు ఉన్నా, నలభై రోజులు ఉన్నా ఒకటే. ఎన్ని రోజులు ఉన్నామని కాదు కావాల్సింది. ఇతరులను దోపిడీలు చేయకుండా ఇతరులమీద చాడీలు చెప్పకుండా ఉండాలి. నేను ఏమని చెపుతున్నానో అర్థం చేసుకుని జీవితంలో వాటిని ఆచరించాలి, అదే ముఖ్యం’’ అన్నాడు.
‘‘అమ్మా ఆకలి గొన్న ప్రాణి ఎవరైనా సరే భగవంతుడే. కనుక ఈ కుక్క ఇందాకటినుంచి ఆకలితో వెర్రిగా తిరుగుతోంది ఏమన్నా దొరుకుతుందేమోనని. నేను నీవు వస్తావని చెప్పాను. నీ రాక కోసం ఎదురుచూస్తోంది అందుకే పెట్టాను’’ అన్నాడు బాబా.
ఆమె ‘ఏమో బాబా నాకేమీ తెలియదు. నీవు ఏమి చెప్పితే అదే చేస్తాను’ అంది.
హిరణ్యకశ్యపుడు ఉండేవాడు కదా. ఆయనకు లేక లేక ప్రహ్లాదుడు కలిగాడు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకునేవాడు. కాని ఆ ప్రహ్లాదుడు నారదుడు చేసిన ఉపదేశంవల్ల నిరంతరమూ విష్ణునామ సంకీర్తనలో మునిగిపోయి ఉండేవాడు. ఈ విషయం రాక్షసులంతా కలిసి హిరణ్యకశపునికి చెప్పారు. తాను కూడా ఈ విషయమే ఆలోచిస్తున్నానని గురువుల దగ్గరకు పంపితే అపుడు ప్రహ్లదుడు మారవచ్చని ఆలోచిస్తున్నట్లు శిరణ్యకశపుడు వారికి చెప్పాడు.
శ్రీకృష్ణుడు- తాను అదితి పుత్రులల్లో విష్ణువును, వాయువుకున్న రకాలల్లో మరీచి అన్న వాయువును, ఏకాదశ రుద్రుల్లో శంకరుణ్ణి, పురోహితుల్లో బృహస్పతిని ఆఖరికి వృక్షాల్లో అశ్వత్థ వృక్షాన్ని, నేను నాగుల్లో అనంతుణ్ణి అంటూ అన్నింటిలోను శ్రీకృష్ణుడే నేను అని చెప్పాడు కదా. మరి ఇన్నింటిలో ఉన్న భగవంతుడి అన్ని రూపాలను పూజించాలా లేక ఒక్క రూపానే్న పూజించాలా స్వామి అన్నాడు.
బాబా చిరునవ్వు నవ్వారు.
చివరి దశలో దుర్యోధనుడు పాండవులకు భయపడి నీటి మడుగులో దాక్కొన్నాడు. చిరంజీవి అయిన అశ్వత్థామ దుర్యోధనుని దురవస్థను చూసి జాలిపడ్డాడు. తాను ఎలాగైనా దుర్యోధనునికి సంతోషం కలిగించాలని తలచాడు. వెంటనే ఆయుధాలు పట్టుకుని పాండవుల శిబిరానికి అర్థరాత్రి వెళ్లాడు. అక్కడ పాండవులు ఎవరూ కనిపించలేదు. కాని పాండవుల బిడ్డలు నిద్రపోతూ కనిపించారు.
అంతేకాదు అసలు బాబాను చూస్తూ ఉన్నప్పుడు ఇహలోకంలో ఏ సంబంధం లేనట్టు ఒక రకమైన ఆనందం వేస్తోంది. అది ఇది అని చెప్పలేని ఆనందం అది. అందుకే అలానే బాబాను చూస్తూ కూర్చుండిపోయాడు సగుణ్.
కొద్దిసేపటి తరువాత ‘‘సగుణ్! ఇక చాలు చూసింది. వెళ్లి ఈ మహిల్సాపతి ఇంట్లో అన్నం తిని మరలా రా నీతో చాలా మాట్లాడవలసి ఉన్నాయి’’ అన్నారు బాబా.
ఇదేంటి నాకు ఇలా కనిపిస్తోంది. ప్రక్కనే ఉన్న మహిల్సాపతిని అడిగాడు.
మహిల్సాపతి ఏముంది? మీరు మీ మనసులో ఘోలప్ స్వామిని దర్శించాలని అనుకున్నావు కదా. అందుకే ఈ రూపంలో సాయి నీకు కనిపించాడు. అంతే మనమేది అనుకుంటే ఆయన ఆ రూపంలో కనిపిస్తాడు అని మహిల్సాపతి శాస్ర్తీకి చెప్పాడు.