S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యాటకం

11/05/2017 - 21:34

ఆ ధ్యాత్మిక ప్రపంచంలో ప్రముఖ మైన వారు భక్తుడు భగవంతుడు. ఇద్దరూ దేనిలోను తీసిపోరు. ఎవరు ఎవరికీ తక్కవకాదు. ఎందు కంటే భక్తుడు భగవంతుని అధీనం.. భగవంతుడు భక్త్ధానం. చిత్త శుద్ధితో, నిజ మైన భక్తితో సంపూర్ణంగా భగ వంతుడికి శరణాగతి పొందితే భక్తుడే భగవంతుడు అవు తాడు. అంటే భక్తి పరమోన్నత మైన స్థాయికి చేరుకున్నప్పు డు భక్తుడే భగవంతుడవు తాడు.

10/01/2017 - 20:17

జ్ఞా నం, యోగం, సిద్ధి మానవ జీవితంలో పరిపూర్ణతను సాధించడానికి కావలసిన సాధనాలు. జ్ఞానం పెరిగే కొలది మనిషి అశాశ్వత భోగాలను అనుభవించిన తర్వాత తనకు నిజమైన ఆత్మతృప్తి, మానసిక శాంతి లభ్యం కాలేదు అని పరితపిస్తాడు. క్షణికానందాన్నిచ్చే కోర్కెలు తీరిన తర్వాత ఏదో వెలితి, ఇదంతా భ్రమ అని బోధపడుతుంది.

09/10/2017 - 22:27

జలం సృష్టిలో జీవరాశికి ముఖ్యమైన ఆధారం. నీరు లేకపోతే మనుగడ లేదు. అందుకే జలం ప్రాముఖ్యాన్ని పలు ఉపనిషత్తులు, వైదిక మంత్రాలు బహుముఖీనంగా వర్ణించాయి.

09/03/2017 - 22:48

క లియుగ వేంకటేశ్వరుడు పలిస్తే పలికే దైవం. ఆయన్ను కొలిచేవారికి తీరని కోరిక ఉండదు. పైగా ఆయన్ను ఎక్కడ చూడాలని వాంఛిస్తారో అక్కడికి ఆ దేవదేవుడే తరలి వస్తాడన్న ఖ్యాతి కలిగిఉన్న పరమాత్మగా కీర్తించబడుతాడు కూడా. అటువంటి ఆ వేంకటేశ్వరుడే నేడిక్కడ పవిత్రమైన నాగావళి నదీ తీరాన కొలువైయున్న తోటపల్లికి వేంచేసాడు. ఈ క్షేత్రంలోని వేంకటేశ్వర స్వామికి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది.

08/27/2017 - 22:35

‘‘లంబస్తనీం, వికృతాక్షీం, ఘోరరూపాం, మహాబలాం!
ప్రేతాసన సమారూఢాం, జోగుళాంబాం నమామ్యహం!
అని స్తుతించబడే జోగులాంబ అమ్మవారు ప్రతిష్ఠితమైన స్థలం అలంపురం.

08/13/2017 - 21:46

అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురమ్
హృదయం మధురం గమనం
మధురం మధురాధిపతే రఖిలం మధురం

07/30/2017 - 22:18

శే్వతాంబరదేవి నానాలంకార భూషితే
జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే
అంటూ శ్రావణ శుక్రవారాలు మహాలక్ష్మి దేవీ పూజను స్ర్తిలందరూ ఆనందోత్సవాలతో జరుపుకొంటారు. మహాలక్ష్మీ అనుగ్రహం కావాలని పెద్దలు పిన్నలూ లింగవివక్షలేకుండా వేడుకుంటారు.

07/23/2017 - 21:32

వేంకటాద్రి సమంస్థానం
బ్రహ్మాండే నాస్తికించన
వేంకటేశ నమో దేవో
న భూతో నభవిష్యతి ..

07/16/2017 - 22:03

‘‘లోకాన తీత్య లాలతే లలితాతేన సోచ్యతే’’ - లోకాలను మించి అతిలోక లావణ్యంతో లాస్యం చేసే లలనామణి- లలితా పరమేశ్వరి. లోకోత్తర లావణ్య భావంతో చిన్మయ చైతన్యంతో ఆనందాతిరేకంతో లలితాంబ చేసే లాస్య లీలలకు లలాటం లలనాస్థలి. ఈ తల్లినే హయగ్రీవుడు ‘శ్రీమాతా’ అన్నాడు. సృష్టికి మూలకారణం ఆదిపరాశక్తి. పార్వతీ పరమేశ్వరులు ఆదిదంపతులు. అఖిల లోకాలను పాలించే తల్లి లలితాపరమేశ్వరి.

07/02/2017 - 21:43

నిరాకారుడు, నిస్సంగుడు అయిన భగవంతుడు తనను కొలిచేవారి కోరికననుసరించి వ్యక్తస్వరూపుడయ్యాడు. అన్నింటికి కారణుడైన ఆ స్వామి ఓ సారి అల్లాణి వంశస్థుల్లో ఒకరికి స్వప్న దర్శనం ఇచ్చారు. నేను తెలంగాణా ప్రాంతాలలోని మంబాపూర్ అడవుల్లో వున్నానని తనకు ఓ ఆలయం కట్టించమని ఆదేశించాడట. ఆ యువకుడు తనకు వచ్చిన స్వప్నాన్ని పెద్దలతో చెప్పాడు. అందరూ కలసి ఆ అడవికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు.

Pages