S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యాటకం

06/25/2017 - 23:01

ప్రారంభంలో బ్రహ్మస్వరూపము, మధ్య భాగంలో మహేశ్వరస్వరూపము చివరకు అంటే పైన విష్ణురూపము ఒక స్తంభంలో ఉన్నవన్న ట్టుగా ఇక్కడ వీర వేంకట సత్యనారాయణ స్వామి త్రిగుణాత్మక రూపంలో రత్నాకరుని కోరిక తీర్చడానికిగాను అన్నవరం లోని అంకుడు చెట్టు మొదట్లోని పుట్టలో వెలిశాడు. ఇలా స్వయంభూగా, అర్చామూర్తిగా రావడానికి వెనుక ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది.
స్థలపురాణం:

06/25/2017 - 22:49

సనాతన ధర్మాన్ని ఆచరించే హైందవ జాతి అనాదినుంచి అమ్మ ఆరాధన జరుపుతూనే ఉంది. సర్వసృష్టికి కారణభూతురాలు ఆదిపరాశక్తి అని తలచేవారు ఆ ఆదిపరాశక్తిని తమ గ్రామదేవతలుగా నెలకొల్పుకున్నారు. ఆషాడశ్రావణాల్లో వచ్చే వర్ష ఋతువు కారణంగా పురుగు పుట్రా వల్ల వచ్చే వ్యాధుల బారినుంచి తమను కాపాడమని జనమంతా జగజ్జననిని వేడుకుంటారు.

06/18/2017 - 21:56

‘శ క్తిస్వరూపిణి పాదపద్మంలోని రేణువును సంపాదించుకుని బ్రహ్మదేవుడు ఈ సమస్త సృష్టిని చేస్తుండగా సృష్టి రూపాన్ని ధరించిన ఆ కణమును శ్రీ మహావిష్ణువు ఎలాగో మోస్తూ ఉండగా...శివుడు చిన్న నలుసువంటి ఆ విశ్వమును లయకాలముతో నలిచి..ఆ భస్మాన్ని విభూదిగా తన శరీరానికి రాసుకుంటూ ఉన్నాడు..’ అని ఆ జగన్మాతను స్తుతిస్తూ ఆదిశంకరాచార్యులవారు సౌందర్యలహరిలో పేర్కొన్నారు.

06/11/2017 - 21:45

యా కుందేందు తుషార హార ధవళా యా
శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండ.....

06/11/2017 - 21:36

ఎర్రని కన్నులతో, తెల్లని ద్రంష్టములతో, నిక్కబొడుచుకున్న రోమాలతో, వాడియైన గోళ్లతో అన్నిలోకాలను గజగజలాడిస్తూ ఉగ్రత్వంతో అడుగు లేస్తున్న నరసింహుడు వికటాట్ట్టహాసంతో నడచి వస్తుంటే విష్ణువెక్కడ అని రంకెలేస్తూ కొడుకు అనైనా చూడకుండా హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుణ్ణి బాధపెడుతుంటే చూడలేక పరుగెత్తుకు వచ్చినట్టుగా వచ్చి స్తంభం నుంచి ఆవిర్భవించి హిరణ్యకశ్యపుడు కోరుకున్నట్టుగానే తన అంకంపై పడవేసి నారసింహుడై హిరణ

06/04/2017 - 22:50

తారకాసురుడనే లోక కంటకుడైన రాక్షసుని సంహరించడం కోసం పార్వతీ పరమేశ్వరుల కుమారుని గా గంగాసుతునిగా, కార్తికేయునిగా, సుబ్రహ్మణు నిగా, షణ్ముఖునిగా ఇలా అనేక నామాలతో అనేక రూపాలతో జన్మించాడు కుమారస్వామి.
తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయప్రాప్తి, వ్యాధి నివారణ, సంతానలాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపచేస్తాడనే పేర్గాం చాడు.

05/29/2017 - 00:53

సర్వసృష్టికి కర్తకర్మక్రియ ఆదిపరాశక్తి. ఆ పరాశక్తి లేనినాడు జగమే లేదు. ఆ తల్లినే అనేక రూపాలను ధరించి దుష్టులను శిక్షిస్తుంది. తన భక్తులను, సజ్జనులను, లోకోపకారం చేసేవారిని సదా రక్షిస్తూ ఉంటుంది. తమను చల్లగా చూడమని ఆ పరాశక్తినే లలితాదేవిగా, దేవీ భక్తులను ఉపాసిస్తారు. లోకాలన్నింటిని తన దృక్కులచేతనే కాపాడేతల్లి ఒకనాడు తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవ గ్రామంలో అవతరించింది.

05/14/2017 - 21:40

చ తుర్ముఖుడు చెప్పిన శుభవార్తను విన్న దేవతలంతా సంతోషించారు. త్వరలో ఆదిదంపతులు, పార్వతీపరమేశ్వరులు శివకుమారుని ప్రసాదిస్తారని ఎంతో ఆనందించారు. ఆ శివకుమారుని వల్లే తారకుని పీడ వదులబోతోందని సర్వజనావళి ఆతృత పడ్డారు. ఏకాంత కేళీవిహారంలో ఉన్న పార్వతీపరమేశ్వరులు ఎంతకీ కుమారోదయం గురించి చెప్పకపోయేసరికి దేవతలు ఆందోళనకు గురయ్యారు. దాంతో దేవతలంతా కలసి శివదర్శనానికి వెళ్లారు.

05/08/2017 - 22:44

క ర్ణాటక రాష్ట్రం చింతామణి తాలూకాలో మురుగుమళ్ళ. మురుగుమలైగా పేర్గాంచిన క్షేత్రంలో ముక్కంటి కోరి కొలువైనాడు. ఈ క్షేత్రానే్న శ్రీ ముక్తీశ్వర స్వామి ఆలయం అని అంటారు. బోళాశంకరుడైన ఈ ఈశ్వరుడు తన్ను దర్శించినంత మాత్రానే మోక్షాన్ని ఇచ్చే మహాశివుడుగా విఖ్యాతి గాంచాడు. అందుకే భక్తులంతా ఈ శివుడిని ముక్తిదాతగా ముక్తీశ్వర స్వామిగా పిలుస్తుంటారు.

04/30/2017 - 22:34

ఏడుకొండల వాడా..వేంకటరమణ..అనగానే కలియుగదైవం మనని కనికరిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మనస్సు నిర్మలంగా, హృదయం పవిత్రంగా, ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటే సదరు భక్తుడిని కాపాడేందుకు దివినుండి భువికి నారాయణుడే దిగివస్తాడు. అలా దిగివచ్చినవాడే ‘కాశీబుగ్గ’లో వేంచేసి ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారు. భాగ్యనగరం హైందవ దేవాలయాలకు ప్రసిద్ది చెందింది.

Pages