S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యాటకం

02/05/2017 - 21:45

మహా విశిష్టత, పవిత్రత, శక్తితత్వం ఈ మూడు కలసి ఉన్న తావే ఆనందవనం. నడిచే దైవంగా ప్రజల పూజలందుకున్న పరమ పూజ్య సద్గురు శివానందమూర్తి నిర్మించిన వనమే ఆనందవనం. ఇక్కడ యోగ మహాగణపతి, మహాలక్ష్మి అమ్మవార్ల దర్శనానికి విశేష ప్రాముఖ్యముంది.

01/29/2017 - 23:16

పవిత్రమైన గోదావరి నది చెంతన, కోనసీమలో పచ్చని పంట పైరులు, కొబ్బరి చెట్ల మధ్య కుండలేశ్వర ఆలయం ఉన్నది. కుండలేశ్వర క్షేత్ర విశిష్టతను, మహత్తును గౌతమీ మహాత్యమను గ్రంథములో ప్రస్తావించబడినది. వృద్ధ గౌతమీనది పుణ్యజలంలో స్నానమాచరించి, ఆ తర్వాత కుండలేశ్వరుని దర్శించి, భక్తిశ్రద్ధలతో పూజలు జరిపిస్తారు. కుండలేశ్వరము దక్షిణ కాశీగా పేరుపొందింది.

01/22/2017 - 22:48

పరాత్పరుడు, పరమేశ్వరుడు, పార్వతీదేవి ప్రియుడు, కామేశుడు, హరుడు, రుద్రుడు, శివుడు, త్రినేత్రుడు, ముక్కంటి, కైలాసవాసుడు, అమరేశ్వరుడు, ముక్తిప్రదుడు ఇలా ఎన్ని పేర్లు అనంతంగా చెప్పినా వాటన్నింటికీ కారణభూతుడు సాక్షాత్తు ఈశ్వరొక్కడే. ఆ ఈశ్వరుని గూర్చి లిప్తపాటుకాలమైనా తలిస్తే చాలు కైలాసదర్శనాన్ని కలుగచేస్తాడు. అమరత్వాన్ని ఇచ్చే అమరనాథునిగా కీర్తిగడించినవాడు.

01/15/2017 - 21:43

ఆద్యంతాలకు కారణభూతురాలు, సర్వసృష్టి నియంత, తన కనుసన్నల్లోనే ముల్లోకాలను ఆజమాయిషీ చేస్తూ చల్లగా చూచే తల్లిగా కీర్తింపబడే ఆదిపరాశక్తినే అనేక రూపాలతో, అనేక నామాలతో తన్ను తాను సృజించుకొంది.

01/01/2017 - 21:49

విష్ణుచిత్తుని భాగ్యాన్ని విల్లివిరియచేసిన విల్లిపుత్తూరు తమిళనాడు మధురై జిల్లా రామనాధపురం తాలూకాలో ఉంది. ధనుర్మాసం ఎపుడు వస్తుందా అని, తన చెలులతో కలసి తాను కూడా ఆ కాత్యాయని వ్రతం చేసుకొందామని ఎదురుచూసిందా తల్లి ఆనాడు. ఆ మాసం రానేవచ్చింది. అసలు చిన్ననాటినుంచి రంగని కొలువున ఉన్న తండ్రి పొందే ఆనందాన్ని తాను చవిచూడాలనుకొంది.

12/25/2016 - 22:35

శ్రీ దత్తాత్రేయుల వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం. వారి అవతారాల్లో ప్రథమావతారమే శ్రీపాద శ్రీవల్లభులు. అంతటి విశిష్టమైన ఈ ప్రథమావతారానికి మన తెలుగునేల శ్రీ పీఠికారపుర క్షేత్రం (నేటి పిఠాపురం) జన్మస్థలం కావడం అత్యంత అద్భుతం. 1320లో (14వ శతాబ్దం) శ్రీపాద శ్రీవల్లభుడు అవతరించారు.

12/25/2016 - 22:38

బెంగుళూరుకు చెందిన శ్రీ దేవదాయ కులకర్ణి దత్తాత్రేయ ఉపాసకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన పిఠాపురం పట్టణానికి విచ్చేసి గురు చరిత్రలో పేర్కొన్న శ్రీపాదుల వారి ఆలయం కోసం ఆరా తీశారు. ఇక్కడ ప్రత్యేకంగా శ్రీపాదులవారి దేవస్థానం లేదని తెలిసి ఆయన తీవ్ర విస్మయానికి లోనయ్యారు.

12/18/2016 - 21:47

ఆపదుద్దారకస్వామిగా నరసింహాస్వామిని కొనియాడుతారు. ఆనాడు ప్రహ్లాదుడిని రక్షించ డానికి స్వామి నారసింహుడుగా రూపమెత్తి స్తంభంలోనుంచి ఉద్భవించాడు. అట్లానే ఏభక్తుడు ఏవిధంగా తన్ను దర్శించాలని అనుకొంటే ఆ రూపంలో తన్నుతాను సృజించుకునేస్వామి నే నరసింహావతారుడు. ఒకానొక కాలంలో వేదాలను సోమకాసురుడను రాక్షసుడు దొంగలించాడు. వాటిని తీసుకెళ్లి సముద్రంలో దాచాడు.

12/04/2016 - 21:59

కృష్ణా జిల్లా దివిసీమలో వెలసిన శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వరస్వామివారి ఆలయం కృష్ణా నదీ తీరాన పెద్దకళ్ళేపల్లిలో దివ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. సాధారణంగా పవిత్ర నదీ తీరాల్లో సిద్ధపురుషులు, యోగులు, మహర్షులు చిరకాల తపస్సుచేసిన కారణంగా సమీప ఆలయాలు మహిమాన్వితమైన కారణంగా వేలాది మంది యాత్రికులు ఆ క్షేత్రమును దర్శించుకుంటారు.

11/27/2016 - 21:08

కలియుగ దైవంగా పేరొందిన కేరళ రాష్ట్రంలోని శబరిమలలో హరిహరసుతుడు కొలువై భక్తులకోరికలను ఈడేరుస్తున్నాడు. నేటికీ వయోభేదం లేకుండా చాలామంది అయ్యప్పమాలాధారణ పట్ల ఎక్కువ ఆకర్షితులై, దీక్షమాలను ధరిస్తున్నారు. కార్తికమాసంలో కుల, మత, జాతి, బేదాలు లేకుండా మాలధారణ చేసినవారు నల్లవస్త్రాలు ధరించి నుదుట విభూతి, చందన, కుంకుమ రేఖలతో దర్శనమిస్తున్నారు.

Pages