ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో ఉచితంగా రిలయన్స్ 4జి సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, మార్చి 11: తిరుమల్లో త్వరలో రూ.7కోట్లతో రిలయన్స్ ఉచిత సేవలను అందించనున్నట్లు టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. శుక్రవారం తిరుమల్లో తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ తిరుమల్లో ఈ-దర్శన్ కౌంటర్లు తొలగించడం బాధకరమని ఆయన టిటిడి అధికారుల తీరుపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్లాక్‌లో శ్రీవారి దర్శనం టికెట్లు అమ్మే దళారులపై ఎలా కేసులు పెడతామో, కొన్న భక్తులపై కూడా కేసులు పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్వాడి గుండం వద్ద శంఖు, చక్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. తుంబూరులో ఆలయ విలీనానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఈ ఆలయానికి రూ.100 కోట్లు ఆస్తులు ఉన్నాయన్నారు. నాయుడుపేట కూడలిలోని పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం, శంఖు,చక్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. మరో మూడు ప్రాంతాల్లో ఎస్వీబిసి స్టూడియో నిర్మాణాలు చేపడతామని ఆయన తెలిపారు. స్వామివారికి విరాళాలిచ్చే దాతలను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించబోమని ఆయన స్పష్టం చేశారు.