రాష్ట్రీయం

ఆదర్శంగా ఏపీ, తెలంగాణ సేద్యం వర్సిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రో), ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆంగ్రోవైస్-్ఛన్సలర్ డాక్టర్ అల్లూరి పద్మరాజు తెలిపారు. ఆంగ్రో వైస్-్ఛన్సలర్‌గా పద్మరాజు పదవీ విరమణ చేయడంతో సోమవారం ఆయనకు యూనివర్సిటీ సిబ్బంది సన్మానం చేశారు. హైదరాబాద్ (రాజేంద్రనగర్)లోని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన వీడ్కోలు సభలో డాక్టర్ పద్మరాజు మాట్లాడుతూ, విత్తనోత్పత్తి రంగంలో రెండు తెలుగు విశ్వవిద్యాలయాల్లో జరిగిన, జరుగుతున్న పరిశోధనలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. మూడేళ్ల క్రితం తాను విసిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒకవైపు సమైక్య రాష్ట్ర ఉద్యమం, మరోవైపు తెలంగాణ ఉద్యమం పెద్దఎత్తున కొనసాగాయని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డప్పటికీ చిన్న సమస్య కూడా రాలేదని తెలిపారు. యూనివర్సిటీ విభజన ప్రక్రియలో ఎలాంటి తగాదాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. రెండు విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డ తర్వాత తిరుపతి, బాపట్ల, రాజమండ్రిలలో మూడు స్నాతకోత్సవాలు జరిగాయని, అందులో ఎక్కువమంది తెలంగాణ విద్యార్థులే డిగ్రీ పట్టాలు తీసుకున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజనకు ముందు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అనేక ఆటుపోట్లు ఎదురైనా విసిగా పద్మరాజు సమర్థతగా గురుతర బాధ్యతలు నెరవేర్చారని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వి. ప్రవీణ్‌రావు పేర్కొన్నారు. రెండు వ్యవసాయ విద్యాలయాలు ఏర్పడ్డ సమయంలో సమస్యలను ఎంతో చతురతతో, సామరస్యంగా పరిష్కరించడంలో పద్మరాజు కృషి ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమానికి ఆంగ్రో రిజిస్ట్రార్ డాక్టర్ టివి సత్యనారాయణ అధ్యక్షత వహించగా, యూనివర్సిటీ అధికారులు ఎ.శివశంకర్, ఎన్. వీర్రాజు తదితరులు మాట్లాడారు.

రాజ్‌నాథ్‌వి తప్పుడు ఆరోపణలు
జెఎన్‌యు కార్యక్రమానికి నా మద్దతు లేదు
వీడియో సందేశంలో హఫీజ్ సరుూద్
లాహోర్, ఫిబ్రవరి 15: అఫ్జల్‌గురు సంస్మరణార్ధం ఢిల్లీలోని జెఎన్‌యులో జరిగిన కార్యక్రమాన్ని తాను ఏ విధంగానూ బలపరచలేదని లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సరుూద్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం వెనక తన హస్తం ఉందంటూ భారత హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ఆరోపణనను తిరస్కరించారు.‘నేను ఢిల్లీ జెఎన్‌యు విద్యార్థుల కార్యక్రమానికి మద్దతు తెలపలేదు. వారిని రెచ్చగొట్టేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. నా పేరును ఉటంకిస్తూ భారత హోమ్ మంత్రి చేసిన ట్వీట్ నిజమైంది కాదు’అని యూ ట్యూబ్‌లో ఓ సందేశంలో సరుూద్ పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళన వెనక తాను ఉన్నట్టుగా ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని స్పష్టం చేశారు. అంతేకాదు కశ్మీర్ స్వాతంత్య్ర ఉద్యమం పట్ల భారత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి ఈ పరిణామాలే నిదర్శనమన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా తన సొంత దేశ ప్రజలను, అలాగే ప్రపంచాన్ని రాజ్‌నాథ్ సింగ్ తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన తెలిపారు. కశ్మీర్ స్వాతంత్య్ర పోరాటాన్ని హాస్యాస్పదంగా పరిగణించకూడదని, వారి ఆవేదనను భారత ప్రభుత్వం పట్టించుకోవాలని సరుూద్ విజ్ఞప్తి చేశారు. కశ్మీర్ అంశాన్ని భారత్ నిర్లక్ష్యం చేస్తోందని పేర్కొన్న సరుూద్ తమ గళాన్ని వినిపించే హక్కు కశ్మీర్ ప్రజలకు లేదా అని ప్రశ్నించారు. కశ్మీరీయులను అణచివేయడానికే అక్కడ భారీగా దళాలను మోహరించిందని లష్కరే చీఫ్ విమర్శించారు.