బిజినెస్
పెట్టుబడుల కోసం ఏపీ రోడ్షో
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 22 December 2016
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం ఢిల్లీలో రోడ్షో నిర్వహించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, సిఐఐ, డిఐపిపి అధ్వర్యంలో మూడు రోజులు జరుగుతున్న ఈ రోడ్షో.. మంగళవారం ముంబయ లో జరగగా, బుధవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి గిరిజా శంకర్ మాట్లాడుతూ కొబ్బరి, అరటి, మామిడి, టమాటతోపాటు పౌల్ట్రీ, ఆక్వా రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. మదుపరులు మంచి లాభాలను అందు కోవచ్చని చెప్పా రు. కాగా, ఈ రోడ్షోలో పాల్గొన్న పారిశ్రామిక వేత్తలు ఏపీలో పర్యటిస్తామని వెల్లడించినట్టు తెలిపారు. గురువారం ఈ రోడ్షో బెంగళూరులో జరుగుతుంది.