ఆంధ్రప్రదేశ్‌

విద్యార్థినిపై అత్యాచారం, హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతానగరం, సెప్టెంబర్ 2: విజయనగరం జిల్లా సీతానగరం మండలం గాదెలవలసలో శనివారం దారుణం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని మిరియాల ఇందుమతి(15) భోజన విరామ సమయంలో శుక్రవారం మధ్యాహ్నం తన స్వగ్రామమైన బొబ్బిలి మండలం రెడ్డివానివలస గ్రామానికి వెళ్లి తిరిగి పాఠశాలకు వస్తుండగా అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు మార్గ మధ్యలో పట్టుకున్నారు. గాదెలవలస గ్రామం సమీపంలో టేకు తోటలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను హత్యచేసి సమీపంలోని చెరువులో పడేసి పరారయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి బొబ్బిలి డిఎస్పీ సౌమ్యలత, సిఐ గోవిందరావు, సీతానగరం ఎస్‌ఐ సాయికృష్ణ వచ్చి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.