మెయన్ ఫీచర్

మణిపూర్.. జాతీయ భావ తేజం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈశాన్య భారతంలోని మణిపూర్ ప్రాంతంలో భారతీయ జనతాపార్టీ బలం గణనీయంగా పెరగడం జాతీయతానిష్ఠ పట్ల పెరిగిన ధ్యాసకు నిదర్శనం. ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల తరువాత మణిపూర్‌లో ఎన్.వీరేంద్ర సింగ్ ముఖ్యమంత్రిగా భాజపా ప్రభుత్వం ఏర్పడడం కేవలం రాజకీయ పరిణామం కాదు. ఇది మన దేశ సార్వభౌమ అధికారం పరిరక్షణకు, మన ప్రాదేశిక సమగ్రతా భద్రతకు, సాంస్కృతిక జాతీయ సమైక్యభావ జాగృతికి దోహదం చేస్తున్న శుభంకర పరిణామం! మణిపూర్ అనగానే మనకు దశాబ్దుల తరబడి కొనసాగుతున్న సంఘర్షణ స్ఫురించడం సహజం! ఈ సంఘర్షణ చైనా ప్రభుత్వ ప్రేరిత, పాశ్చాత్య దేశాల మత పరివర్తన షడ్యంత్ర ప్రేరిత బీభత్సకారులకు- మన సైనిక దళాలకు మధ్య కొనసాగింది, కొనసాగుతోంది! ఈ సంఘర్షణ 1947లో మన దేశం బ్రిటన్ దుండగుల పెత్తనం నుంచి విముక్తమైన నాటినుంచి కొనసాగుతోంది! ఉడాయించిన బ్రిటన్ సామ్రాజ్యవాదులు ఈశాన్య భారతంలో విద్రోహ విషబీజాలను నాటివెళ్లారు. మిజోరమ్‌ను, నాగాలాండ్‌ను దేశం నుండి విడగొట్టాలన్న విషవాంఛలు బహిరంగంగానే బుసలుకొట్టాయి! ఇలా ‘నాగాలాండ్‌ను విడగొట్టి స్వతంత్ర దేశంగా ఏర్పాటుచేయదలచిన’ విద్రోహులు మణిపూర్‌లోని అనేక భూభాగాలను, అరుణాచల్‌ప్రదేశ్‌లోని మరికొన్ని భూఖండాలను నాగాలాండ్‌లో కలిపి ‘విస్తృత నాగాలాండ్’ను ఏర్పాటుచేయాలని కోరారు. ఈ ‘విస్తృత నాగాలాండ్’ను దేశం నుండి విడగొట్టి ‘స్వతంత్ర దేశం’గా రూపొందించాలన్నది మతోన్మాదపు తోడేళ్ల పగటి కల! ఈ తోడేళ్లను మన దేశంలో శతాబ్దుల తరబడి మతం మార్పిడులను సాగించిన ఐరోపా ప్రేరిత ‘క్రైస్తవ మిషనరీ’లు ఉసిగొల్పాయి. మాతృదేశం పట్ల మమకారం గల ఇస్లాం మతస్థులకు ‘జిహాదీ’ హంతకులతో సంబంధం లేనట్టే మన దేశాన్ని బద్దలుకొట్టడానికి యత్నిస్తున్న ‘మతం మార్పిడి క్రైస్తవ మిషనరీల’తో దేశభక్తులైన క్రైస్తవ మతస్థులకు సంబంధం లేదు. ఈ దేశంలో పుట్టిపెరిగిన శైవ, వైష్ణవ, బౌద్ధ, జైన, సిక్కు తదితర మతాల వారివలె, విదేశాల నుంచి వ్యాపించిన ఇస్లాం,క్రైస్తవ మతాల వారు కూడ అనాది జాతిలో భాగమైపోయారు. ఈ అనాది జాతి హిందుత్వం, భారతీయత! జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న జిహాదీలను ముస్లింలు, ఐరోపా ప్రేరిత ‘మతం మార్పిడి ముఠాల’ను క్రైస్తవులు వ్యతిరేకిస్తున్నారు! ‘జిహాదీ’ల దేశద్రోహ కలాపాలను, ‘మతం మార్పిడి’ ముఠాల కలాపాలను వ్యతిరేకిస్తున్న జాతీయవాదులను ఇతర మతాల వారితోపాటు ఇస్లాం మతస్థులు, క్రైస్తవులు సమర్ధిస్తున్నారు. జిహాదీల పట్ల వ్యతిరేకత ఇస్లాం పట్ల వ్యతిరేకత కాదు, ‘క్రైస్తవ మిషనరీల’ ఐరోపా కుట్రను వ్యతిరేకించడం భారతీయ కైస్తవులను వ్యతిరేకించినట్టు కాదు.. కానీ, ‘ఇస్లాం’ బాహుళ్య భారత భూభాగాలను జిహాదీలు విడగొట్టి 1947లో పాకిస్తాన్‌ను ఏర్పాటుచేశారు! అదే రీతిలో క్రైస్తవ బాహుళ్య ప్రాంతాలను దేశం నుండి విడగొట్టి ప్రత్యేక దేశంగా ఏర్పాటుచేయాలన్నది ‘ఐరోపా’ ఉసిగొల్పిన ‘మతం మార్పిడి’ మిషనరీల కుట్ర.. ఈ కుట్రను కొనసాగించడానికి 1947 నుంచి ప్రయత్నం జరుగుతుండడం, మన సైనికులు ఈ కుట్రను నిరోధిస్తుండడం దశాబ్దులపాటు ఈశాన్య ప్రాంతాలు కల్లోలగ్రస్తం కావడానికి నేపథ్యం!
మణిపూర్‌లో సైనిక దళాల ఉనికిని వ్యతిరేకించిన వారు ఈ ‘సంఘర్షణ’లో విద్రోహులు లేదా విద్రోహుల కొమ్ముకాస్తున్నవారు! మిజోరమ్ క్రైస్తవ బాహుళ్య ప్రాంతం, నాగాలాండ్ క్రైస్తవ బాహుళ్య ప్రాంతం! ఈ రెండు రాష్ట్రాలకు మధ్యలో మయన్మార్ దేశానికి సరిహద్దుకు పడమరగా అస్సాంకు తూర్పుగా విస్తరించి ఉన్న ప్రాంతం మణిపూర్! మణిపూర్ క్రైస్తవ బాహుళ్య ప్రాంతం కాదు! కానీ మిజోరమ్, నాగాలాండ్‌లతోపాటు మణిపూర్‌ను కలిపి దేశం నుండి విడగొట్టాలన్నది మిజోరమ్‌లోను నాగాలాండ్‌లోను 1947 నుంచి విద్రోహకాండ సాగించినవారి ‘లక్ష్యం’! ఈ విద్రోహానికి విరుగుడు మణిపూర్‌లోను ఇతర ప్రాంతాలలోను సైనిక దళాల ఉనికి! 2002లో ఆఫ్రికాలోని దర్బన్‌లో ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. ‘స్వచ్ఛంద సంస్థల సమాఖ్య’ పేరుతో జరిగిన ఆ సదస్సులో ఒక ‘పరిశోధన’ పత్రాన్ని పంచిపెట్టారు! ఆ పత్రంలో ‘మిజోరమ్, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రాంతాలు విదేశీయ ప్రభుత్వ దమన నీతికి గురిఅవుతున్నట్టు..’ పేర్కొన్నారట! అంటే ‘ఈశాన్య ప్రాంతాలకు భారత ప్రభుత్వం విదేశీయ ప్రభుత్వమన్నది’ ఈ ‘స్వచ్ఛంద సంస్థల’- నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్- ‘ఎన్‌జిఓ’లు- చెప్పదలచిన అబద్ధం! ‘ఎన్‌జిఓ’లలో అధిక శాతం ‘మతం మార్పిడి’ ముఠాలు!
ఈ మతం మార్పిడి ముఠాల బీభత్సకాండకు తోడుగా చైనా ఉసిగొల్పుతున్న ‘వర్గ విద్వేష బీభత్స’పు తోడేళ్లు కూడ మణిపూర్‌లోకి చొరబడుతూనే ఉన్నాయి, ఈశాన్యంలోకి దూకుతూనే ఉన్నాయి! ఈ బీభత్సకారులు మన సరిహద్దు సమీపంలోని మయన్మార్‌లో స్థావరాలు ఏర్పరచుకున్నారు! ‘ఆంగ్‌సాన్ సూచీ’ నాయకత్వంలోని ప్రజాస్వామ్య ఉద్యమం విజయవంతమైన తరువాత గత రెండేళ్లుగా మయన్మార్ మన దేశం పట్ల కొంత మైత్రిని వహిస్తోంది. మయన్మార్ నౌకాదళం వారికి శిక్షణ ఇవ్వడానికి మన ప్రభుత్వం అంగీకరించింది. కానీ, 2015 వరకు దాదాపు ఐదు దశాబ్దులపాటు మయన్మార్‌లో సైనిక నియంతృత్వాన్ని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం నడిపించింది. అందువల్ల మయన్మార్‌లో స్థావరాలను ఏర్పాటు చేసుకున్న చైనీయ సమర్ధకులు మణిపూర్‌లోను, ఇతర ఈశాన్యంలోను నిరంతరం హత్యాకాండ జరపడం చరిత్ర! ‘నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్’ పేరుతో చైనా తొత్తులు, ఐరోపా స్వచ్ఛంద ‘మతం మార్పిడి’ సంస్థల తొత్తులు కలిసికట్టుగా దశాబ్దులపాటు మణిపూర్‌ను, పరిసర ప్రాంతాలను రక్తసిక్తం చేశారు. దిగ్బంధనాలు జరిపారు! అన్ని విద్రోహ సంస్థలు కాలక్రమంలో వర్గాలుగా చీలిపోవడం సహజమైన పరిణామం. కశ్మీర్‌లో ఇదే జరిగింది, అస్సాంలో ఇదే జరిగింది, ఈశాన్యంలోని మిగిలిన ప్రాంతాలలో ఇదే జరుగుతోంది! ‘నక్సలైట్లు’ చీలికలు పేలికలుగా మారడం కూడ ఇదే పరిణామ క్రమం! ఈ ‘నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్’ కూడ గత రెండు దశాబ్దులుగా చీలిపోయి ముఠాలుగా ఏర్పడింది! కొన్ని ముఠాలు ‘విస్తృత నాగాలాండ్’- స్వతంత్ర దేశం కావాలన్న విద్రోహ లక్ష్యాన్ని విడనాడి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు మొదలుపెట్టాయి. ఇలాంటి ‘చర్చల’ ముఠాలలో ఒకటైన ‘నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్’- ఎన్‌ఎస్‌సిఎన్- ఇసాక్ ముయివా ‘వర్గం’తో 2015 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం శాంతి ఒప్పందం కుదుర్చుకొంది. కానీ, విద్రోహ లక్ష్యాన్ని విడనాడని ఎస్‌ఎస్ కప్లాంగ్ నాయకత్వంలోని ‘ఎన్‌ఎస్‌సిఎన్’ ముఠావారు మణిపూర్‌లో బీభత్సకాండను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ బీభత్సకాండకు వ్యతిరేకంగా పోరాడుతున్న మన సైనిక దళాల ఉనికిని వ్యతిరేకిస్తున్న వారిలో ‘ఇరోమ్ శర్మిల’ అనే మహిళ ఇటీవల పేరుమోసింది!
మయన్మార్‌లో స్థావరాలు నెలకొల్పుకున్న ఈ ‘కప్లాంగ్’ ‘ఎన్‌ఎస్‌సిఎన్’ ముఠావారు 2015 జూన్‌లో మణిపూర్‌లోని మన సైనికులపై జరిపిన దాడి చైనా ప్రేరిత బీభత్సకాండకు పరాకాష్ఠ. ఇరవై మంది మన సమరవీరులు అమరులైపోయారు. ఇందుకు ప్రతీకారంగానే మన ప్రభుత్వం చరిత్రలో మొదటిసారిగా ‘పట్టిపరిమార్చే’- హాట్‌పర్‌సూట్- రక్షణ విధానాన్ని అమలు జరిపింది. సరిహద్దును దాటి మయన్మార్‌లోకి చొచ్చుకొనిపోయిన మన సైనికులు 2015 జూన్ పదవ తేదీన సరిహద్దుల సమీపంలోని బీభత్స మూకల స్థావరాలను ధ్వంసం చేశారు. మయన్మార్ ప్రభుత్వం నోరు మెదపలేదు. ‘బీభత్సకారులతో మాకు సంబంధం లేదు..’ అని చైనా ప్రభుత్వం గుమ్మడికాయల దొంగవలె భుజాలను తడుముకొంది! ఏమైనప్పటికీ దశాబ్దుల బీభత్సకాండ నుండి, అంతర్గత కల్లోలకాండ నుండి తమకు విముక్తిని ప్రసాదించగల కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు అవతరించినందుకు మణిపూర్ ప్రజలు సంతోషించారు.. ఈ ‘రాజకీయ నిర్వాహకులు’ భారతీయ జనతాపార్టీ వారు! భారతీయ జనతాపార్టీని సమర్ధిస్తున్న మణిపూర్ ప్రజల సంఖ్య రెండేళ్లలో ఇబ్బడిముబ్బడిగా పది రెట్లుగా ఇంకా ఎక్కువగా పెరిగిపోవడానికి ఈ ‘్భద్రత’ కారణం, ఈ జాతీయ సమైక్య తత్త్వం ప్రేరకం. సరిహద్దుల సంరక్షణ పట్ల పెరిగిన ధ్యాస కారణం! ‘దుర్జనుడు ప్రతిగా అపకారం పొందినప్పుడు అణగిపోతాడు.. ఉపకారం చేసి బుజ్జగించడం వల్ల దారికి రాడు!’- ‘శామ్యేత్ ప్రతి అపకారేణ న ఉపకారేణ దుర్జనః’ అని మహాకవి కాళిదాసు కలియుగం ముప్పయి ఒకటవ శతాబ్దిలో చెప్పాడు! అతని సమకాలికుడు విక్రమ సమ్రాట్టు ఈ నీతిని పాటించాడు. పడమటి సరిహద్దులను దాటివెళ్లి సరిహద్దుల సమీపంలోని ‘శకులన్న’ బీభత్సకారుల ‘బట్టీ’లను ధ్వంసం చేశాడు. రెండువేల వంద సంవత్సరాల తరువాత, ఇప్పుడు కలియుగం యాబయి రెండవ శతాబ్దిలో తూర్పు సరిహద్దులో ‘విక్రముని’ నీతి పునరావృత్తమైంది! మయన్మార్‌లోని బీభత్సపు బట్టీలను ‘నరేంద్ర’ ప్రభుత్వం ధ్వంసం చేసింది! రక్తసిక్త భూములలో ‘కమల దళాలు’ వికసించి జాతీయ భావ పరిమళం సభలను తీర్చడానికి ఇదీ కారణం! ఇది కేవలం ‘్భజపా’కు జరిగిన మేలుకాదు, భారత ప్రాదేశిక సమగ్రతకు ఏర్పడిన భద్రత.. మణిపురం ‘బబ్రువాహను’ని భూమి. ఈ ప్రాంతంలో ఇప్పటికీ ‘బబ్రువాహన’ దేవాలయాలున్నాయి. బబ్రువాహనుడు పాండవ మధ్యముడైన అర్జునునికీ, చిత్రాంగద అనే మణిపురం ఆడపడుచుకు జన్మించిన వజ్రాల బిడ్డడు. చిత్రాంగదా అర్జున దంపతులు, వారి కొడుకు బబ్రువాహనుడు ద్వాపరయుగం నాటి వారు, ఐదువేల రెండువందల ఏళ్లనాటి వారు! అప్పటి నుంచి అంతకు పూర్వం నుంచి అనాది నుంచి ‘మణిపురం’ భారత్‌లో భాగం, ఈశాన్యం భారత్‌లో భాగం!!. ‘కాదని’ ఇప్పుడు చైనా కాకిగోల చేస్తోంది! ఈ ‘గోల’కు కారణం 1935లో అప్పటి బర్మాను బ్రిటన్ దుండగులు మన దేశం నుండి విడగొట్టడం.. దేశ వ్యతిరేకులతో, విచ్ఛిన్నవాదులతో దశాబ్దులుగా జాతీయవాదులు సంఘర్షణ సాగిస్తున్నారు. ‘్భజపా’ వరిష్ఠనేత మధు మంగళశర్మను విద్రోహులు 1990వ దశకంలో హత్యచేసిన నాటి నుండి అంతకు పూర్వం నుండి ఈ ‘సంఘర్షణ’ జరుగుతోంది. మధుమంగళ శర్మ లాంటి దేశభక్తులకు మాధ్యమాలలో ప్రచారం లేదు! మణిపూర్‌లో సైనికులుండరాదన్న విద్రోహ వాంఛను వ్యక్తం చేసిన ‘ముక్కుగొట్టం’ శర్మిల వంటి వారికి గొప్ప ప్రచారం లభించింది! సైనికులుంటే విద్రోహులు పలాయనం చిత్తగిస్తారు. సైనికులు లేకుంటే విద్రోహులు విజృంభిస్తారు! సైనికులు ఉండరాదన్న ‘ఐరోమ్’ శర్మిలను వోటర్లు ఓడించడం ‘జాతీయత’కు విజయం. దేశద్రోహానికి పరాజయం! ‘ఐరోమ్’ను పొరపాటున ఎవరో ‘ఐరన్’ అని వ్రాశారట. ‘ఎమ్’కు బదులు ‘ఎన్’ అచ్చయిందట! అంతే ఆమెను ‘ఐరన్’శర్మిల అని, ‘ఉక్కు మహిళ’ అని ఊదరగొట్టేశారు. పదహారు ఏళ్లపాటు నోటితోకాక ముక్కుతో భోంచేయడం ఆమె చేసిన నిర్వాకం.

-హెబ్బార్ నాగేశ్వరరావు 2013hebbar@gmail.com