రాష్ట్రీయం

31కోట్ల అవినీతి సొమ్ము పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏసిబి డైరెక్టర్ జనరల్ వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 31: 2015లో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని అభియోగాలపై దాడులు నిర్వహించి 20 కేసులు నమోదు చేశామని, ఈ దాడుల్లో రూ. 31కోట్ల అవినీతి సొమ్మును పట్టుకున్నామని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 139 కేసులు నమోదు కాగా 20 కేసులు ఆదాయానికి మించిన ఆస్తులుగానూ, 21 మిస్ కండక్ట్ కేసులు, 24 రెగ్యులర్ విచారణకు సంబంధించినవి కాగా మరో 54 కేసులు ఆకస్మిక తనిఖీల కేసులుగా నమోదైనట్టు ఏసిబి డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు. గత ఐదేళ్లలో పోలిస్తే ఈ సంవత్సరం 74శాతం వివిధ కేసుల్లో శిక్షలు పడ్డాయని, 40క్రమశిక్షణరాహిత్యం కేసులు నమోదుకాగా 29 కేసులకు సంబంధించి శిక్ష పడిందని, 21మంది అధికారులు డిస్మిస్ అయినట్టు తెలిపారు.