ఆంధ్రప్రదేశ్
ఏసీబీ వలలో పౌరసరఫరాల శాఖ అధికారి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 23 September 2016
కాకినాడ: రూ. 20 వేలు లంచం తీసుకుంటున్న పౌరసరఫరాలశాఖ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజ్కుమార్ను ఏసీబీ అధికారులు శుక్రవారం పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆలమూరు మండలం పేకేరు గ్రామానికి చెందిన బలరామకృష్ణ బియ్యాన్ని ట్రాక్టర్ల ద్వారా తరలించేందుకు వర్క్ ఆర్డర్ కోసం కొద్దిరోజులుగా రాజ్కుమార్ను కలుస్తున్నాడు. వర్క్ ఆర్డర్ ఇవ్వాలంటే రూ.30వేలు లంచం ఇవ్వాలని రాజ్కుమార్ డిమాండ్ చేశాడు. రూ.20వేల ఇచ్చేందుకు అంగీకరించిన బలరామకృష్ణ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. రాజ్కుమార్ను రేపు విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.