ఆంధ్రప్రదేశ్‌

గాయపడ్డ రమ్య మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:కారులో వెడుతూండగా అతివేగంగా వచ్చి అదుపుతప్పిన మరోవాహనం మీదపడిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన పదేళ్ల చిన్నారి రమ్య మృతిచెందింది. పాఠశాలలో చేరిన తొలిరోజు ఇంటికి వస్తూండగా ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వారంరోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆమె శనివారం రాత్రి తుదిశ్వాస విడిచింది. కాగా ఈ సంఘటనలో ఆమెతల్లి, మామయ్యకూడా తీవ్రంగా గాయపడ్డారు. కాగా ప్రమాదం జరిగినవెంటనే రమ్యను నిమ్స్ ఆస్పత్రికి తరలించినా నాలుగు గంటలపాటు ఏ పరీక్షలు చేయకుండా జాప్యం చేశారని, సకాలంలో చికిత్స ప్రారంభించలేదని రమ్య తల్లి, బంధువులు ఆరోపించారు. తాగి వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన 20 ఏళ్ల యువకుడిపై కేసు నమోదు చేశారు. రమ్య మృతితో విషాదం అలుముకుంది.