తెలంగాణ
మూడో రోజు కోలాహలంగా చండీయాగం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 25 December 2015
మెదక్: తెలంగాణా సీఎం కె.సి.ఆర్. మెదక్ జిల్లా ఎర్రవల్లిలో తన ఫామ్హౌస్లో నిర్వహిస్తున్న అయుత చండీయాగం మూడోరోజు కార్యక్రమాలు శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. కెసిఆర్ దంపతులు గురుప్రార్థనతో యాగాన్ని ప్రారంభించారు. గణపతి పూజ, చండీ పారాయణం, నవగ్రహ స్తుతి వంటి కార్యక్రమాలను రుత్విజులు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు, ఎ.పి. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఎపి శాసన మండలి చైర్మన్ చక్రపాణి తదితరులు యాగాన్ని సందర్శించేందుకు వచ్చారు.