అదిలాబాద్

రాష్ట్ర స్థాయిలో టిడిపి బలపడుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల అర్బన్, నవంబర్ 6: రాష్ట్ర స్థాయిలో టిడిపి బలపడుతుందని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బోడ జనార్దన్ అన్నారు. ఆదివారం నస్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ టిడిపి కార్యకర్తలు కష్టసుఖాల్లో తమ వెంటే ఉంటూ టిడిపి బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో టిడిపి బలపడి ఎంపి, ఎమ్మెల్యే సీట్లు గెలవడం ఖాయమన్నారు. టిడిపి నుంచి కొంత మంది నాయకులు వెళ్లినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సుమారు 50మంది కార్యకర్తలు టిడిపిలో చేరారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కోశాధికారి గోపతి మల్లేష్, ప్రచార కార్యదర్శి నేరడిగొండ శ్రీనివాస్, టిడిపి నాయకులు సింగతి మురళి, విద్యార్థి నాయకులు కిరణ్, మదుకర్, రాజు, శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.