అదిలాబాద్
ఆర్ధరాత్రి వేళ జిల్లా ఎస్పీ పెట్రోలింగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆదిలాబాద్, మే 15: జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించే ఎంతటి వారైన కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతలను పరిరక్షించాలని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ అన్నారు. ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలో పలు కార్లను ధ్వంసం చేసి ఆశాంతిని ప్రేరేపించిన ఓ వర్గానికి చెందిన అల్లరి మూకల ఘటన నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుండి రెండు గంటల వరకు పట్టణంలోని పంజాబ్చౌక్, టీచర్స్కాలనీ, శాంతినగర్, ద్వారాక నగర్, రాణి సతీజ్కాలనీల్లో ఎస్పీ స్వయంగా పెట్రోలింగ్ నిర్వహించి, గస్తీపై తనిఖీలు చేపట్టారు. పోలీసులు రాత్రి వేళల్లో ముమ్మర నిఘా నిర్వహిస్తూనే శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. తమ విధులను విస్మరించే వారిపై ఊపేక్షించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే ఎంతటివారైన కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఎస్పీ తనిఖీలో భాగంగా శిక్షణ కేంద్రం డి ఎస్పీ కె.సీతారాములు, బజార్హత్నూర్ ఎస్సై శ్రీకాంత్తో ఎస్పీ శాంతిభధ్రతలపై అడిగి తెలుసుకున్నారు. పికెట్స్ విధుల్లో ఉన్న పోలీసులు ఎలాంటి సంఘటనలకు తావివకుండా గస్తీ ముమ్మరం చేయాలని అన్నారు. అనంతరం సోమవారం ఉదయం జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిపై పోలీసుఅధికారులతో సమీక్షించారు. అనంతరం ప్రజాఫిర్యాదులో ఎస్పీ పాల్గొనగా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి 14 మంది ఫిర్యాదు దారులు హాజరై తమ సమస్యలను నేరుగా ఎస్పీకి వివరించిన అనంతరం ఆర్జీలను సమర్పించారు. ఈ సంధర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు రోజు వారి ఫిర్యాదులను పరిష్కరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహళ ఫిర్యాదులపై వెంటనే దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు విధుల్లో గస్తీని పెంచి సంబంధిత ఎస్సైలు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. ఇటీవలే జిల్లాలో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్గించే ప్రయత్నం చేశారని, వారి కుట్రలకు సరైన రీతిలో జవాబు ఇవ్వడం జరిగిందన్నారు. ఉట్నూరు, ఆదిలాబాద్ పట్టణంలో నమోదైన కేసుల్లో డి ఎస్పీ స్థాయి అధకారులచే పటిష్టంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠినంగా శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల పూర్తి రక్షణ బాధ్యత పోలీసులపై ఉందని, వారి భరోసాలను నిలబెట్టే విధంగా పోలీసులు విధులు నిర్వర్తించాలని అన్నారు. అనంతరం విధి నిర్వహణలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు పోలీసు సంక్షేమ నిధి కింద రూ.15వేల విలువగల చెక్కును ఎస్పీ అందజేశారు. గత సంవత్సరం డిసెంబర్ 20న జైనథ్ బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న దారట్ల శ్రీకాంత్ కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో హోంగార్డు జనవరి 24న బోథ్ మండలంకు చెందిన ఆడెపు నర్సింహాదాస్ ఆనారోగ్యంతో మరణించగా, ఇరువు కుటుంబ సభ్యులకు రూ.15వేల చొప్పున అందజేశారు. పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు అన్ని విధాల అండగా ఉంటామని అన్నారు. చెడు అలవాట్లను దరిచేరనీయకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఆర్ఐ బి జెమ్స్, ఆర్ఎస్సై బి.పెద్దయ్య, సిబ్బంది సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగాల కోసం ప్రజావాణిలో ఆర్జీలు పెట్టుకోవద్దు
* నిర్మల్ జిల్లా కలెక్టర్ ఇలంబరిది
దివ్యనగర్, మే 15: ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఉద్యోగాల కోసం ఆర్జీదారులు దరఖాస్తులు పెట్టుకోకూడదని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఇలంబరిది అన్నారు. సోమవారం నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ ఉద్యోగ ప్రకటనలు వెలువడినప్పుడే అర్హతలను జారీచేస్తారని, అప్పుడే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన ఆర్జీదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆర్జీలను కాలయాపన చేయకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. డబుల్బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి 45 మంది, పెన్షన్ల కోసం 38 మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. అలాగే భైంసా మండలం మహగాం గ్రామానికి చెందిన 30 మంది గ్రామస్తులు బీడి, వృద్దాప్య పింఛన్ల కోసం, నిర్మల్కు చెందిన జె.్భలక్ష్మి, పి.లావణ్య ఒంటరి మహిళ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెసి సి.హెచ్.శివలింగయ్య, డి ఆర్వో నాగేష్, ఆర్డివో ప్రసూనాంభ, మైనార్టీ అధికారి ప్రేమ్కుమార్, డి ఎవో గంగాధర్, డి ఆర్డివో పిడి వెంకటేశ్వర్లు, డిడబ్ల్యూవో విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.