అదిలాబాద్

అనారోగ్యంతో కవలలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమిని, అక్టోబర్ 20: కనె్నపల్లి మండలం రెబ్బెన గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన తాళ్లపల్లి కిష్టయ్య-మల్లేశ్వరీ దంపతులు కుమారులు రాహుల్, రాము గురువారం మంచిర్యాలలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘనట వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రాహుల్ - రాములు ఇద్దరు కవల పిల్లలు. వీరు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాలుగు రోజుల క్రితం జ్వరం సోకడంతో గ్రామంలో ప్రైవేట్ వైద్యుని వద్ద చికిత్స చేయించినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో గురువారం మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఒకరి పరిస్థితి విషయంగా ఉందని కరీంనగర్‌కు తరలించాలని వైద్యులు సూచించడంతో అంబులెన్స్‌లో కరీంనగర్‌కు వెల్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడని, కొంత సమయానికి మంచిర్యాలలో చికిత్స పొందుతున్న ఇంకో బాలుడు కూడా మృతి చెందాడని తల్లిదండ్రులు విలపిస్తూ తెలిపారు.