అదిలాబాద్

పోలీసుల సంక్షేమానికి ప్రత్యేక కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, అక్టోబర్ 20: జిల్లాలో పోలీసుల సంక్షేమంతో పాటు విధి వశాత్తు మృతి చెందిన అమరజవానుల కుటుంబాల సంక్షేమం కోసం పోలీసు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో పోలీ సు కుటుంబ సభ్యులతో ఎస్పీ సమావేశమయ్యారు. ఉచిత బస్‌పాస్‌ల్లో ఉన్న లోపాలను బాధిత కుటుంబ సభ్యులు ఎస్పీ దృష్టికి తీసుకురాగా వెంటన్ ఆర్టీసీ డిఎం సూర్యనారాయణతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. స్థానిక పిట్టలవాడలోని పోలీసు అమరవీరుల కాలనీలో ప్రహారీగోడను నిర్మించాలని ఎస్పీని కోరగా గోడకు సంబంధించిన ఖర్చుల ప్రతిపాదన సిద్దం చేయాలని ఎన్‌ఐబి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో 9మంది అమరవీరుల కుటుంబ సభ్యులు ఉన్నారని, వారికి వేతనంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయన్నారు. అమరవీరుల కాలనీలో ఇళ్ల నిర్మాణం చేయని వారికి బ్యాంకు అధికారులతో మాట్లాడి రుణసౌకర్యం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పోతారం శ్రీనివాస్, ప్రతినిధులు ఎస్‌కె తాజోద్దిన్, అధికారులు జె.పుష్పరాజ్, జె.్భరతి, కె.పుష్ప, స్పెషల్ బ్రాంచ్ అధికారులు అన్వర్ ఉల్ హఖ్, జి.రామన్న, సిసిఎం పోతరాజు తదితరులు పాల్గొన్నారు.