అదిలాబాద్
తోడెళ్లదాడిలో పది గొర్రెల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 9 April 2016
జన్నారం, ఏప్రిల్ 8: మండలంలోని రేండ్లగూడ గ్రామంలలో శుక్రవారం తెల్లవారు జామున గ్రామంలోని కందెవేణి మల్లయ్యకు చెందిన గొర్రెల మందపై తోడేళ్లుదాడి చేయడంతో పది గొర్రెలు మృతి చెందగా, మరో పది గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుని కథనం మేరకు గురువారం రాత్రి గొర్రెలను పాకలోకి పంపించామని, తెల్లవారు జామున గొర్రెల అరుపులు విని తాము వెళ్లిచూడగా తోడేళ్లు వెళ్లిపోగా పది గొర్రెలు మృతి చెందడం జరిగిందన్నారు. సంఘటన స్థలాన్ని జన్నారం డిప్యూట్ రేంజ్ ఆఫీసర్ మోహినోద్దిన్, బీట్ ఆఫీసర్ బోజానాయక్లు సందర్శించారు. మృతి చెందిన గొర్రెలకు రాకేష్ శర్మ పోస్టుమార్టం నిర్వహించారు. కాగా బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ వెంకట్రాజం కోరారు.