అదిలాబాద్

వడదెబ్బతో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌటాల, ఏప్రిల్ 15: కౌటాల మండలంలోని మొగడ్‌దగడ్ గ్రామానికి చెందిన చౌదరి పరదేశి (50) అనే వ్యక్తి శుక్రవారం వడదెబ్బ తగిలి మృతిచెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం పరదేశి రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఉదయం తన చేనులో వేసిన పత్తిపంట మొక్కలను తొలగించేందుకు వెళ్లి అస్వస్థతకు గురయ్యాడని, ఇబ్బంది పడుతూ ఇంటికి చేరిన పరదేశి ఆరోగ్యం మరింత క్షీణించడంతో పాటు పలుమార్లు వాంతులు చేసుకోగా, కుటుంబీకులు మండల కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి ఇంటికి తీసుకురాగా, ఆయన పరదేశి ఇంటి వద్ద మృతిచెందాడని వారు తెలిపారు. మృతునికి భార్య మాయాభాయితో పాటు పిల్లలు ఉన్నారు.
రుద్రాపూర్‌లో వృద్దురాలు మృతి
బెజ్జూరు: బెజ్జూరు మండలం రుద్రాపూర్ గ్రామానికి చెందిన ఇప్ప మల్లక్క (55) శుక్రవారం వడదెబ్బతో మృతిచెందింది. శుక్రవారం రుద్రాపూర్ గ్రామంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఇప్ప మల్లక్క హాజరై ఎండలో ఇంటికి వెళ్లి వేడి నీరు అధికంగా సేవించడంతో మృతిచెందినట్లు మృతురాలి భర్త ఇప్ప బానయ్య తెలిపారు. మృతురాలికి నలుగురు కుమారులున్నారు.