అదిలాబాద్

అన్నదమ్ముల మధ్య ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఏప్రిల్ 17: తండ్రి డిపెండెంట్ ఉద్యోగం విషయంలో ఇద్దరు సోదరుల మధ్య జరిగిన గొడవలో తమ్ముడు మృతి చెందిన సంఘటన మండలంలోని రసూల్ పల్లిలో జరిగింది. జైపూర్ పోలీసుల కథనం ప్రకారం.. రసూల్ పల్లికి చెందిన జాడి చిన్న రాజం సింగరేణి కార్మికునిగా పనిచేసి ఇటీవల ఆరోగ్య రీత్యా రిటైర్ మెంట్ తీసుకొని పెద్ద కొడుకయిన సంజీవ్‌కు తన ఉద్యోగం ఇప్పించాడు. అయితే ఈ విశయంలో మరో కుమారుడు లక్ష్మనారాయణతో సంజీవ్‌తో ఫిబ్రవరి 4న గొడవ పెట్టుకొని కొట్టుకోగా అక్ష్మినారాయణ తలకు గాయమై కోమాలోకి వెల్లిపోయాడు. అతనికి కరీంనగర్, హైదరాబాదుల్లో చికిత్స చేయించి నప్పటికి ఫలితం లేకపోవటంతో ఈనెల 3న ఇంటికి తీసుకవచ్చారు. ఈ క్రమంలో ఆదివారం లక్ష్మినారాయణ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.