అదిలాబాద్

‘పంచాయతీ’ ఎన్నికలకు మోగిన నగారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జనవరి 1: పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ మంగళవారం ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీ చేసింది. శాసన సభ ఎన్నికలు పూర్తికావడంతో ఇక స్థానిక సమరానికి రాజకీయ నేతలు సన్నాహలు సాగిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని 467 గ్రామపంచాయతీలు, 3822 వార్డులు, నిర్మల్ జిల్లాలో 396 పంచాయతీలు, 3338 వార్డులు, మంచిర్యాల జిల్లాలో 325 పంచాయతీలు, 2730 వార్డులు, కుమురంభీం జిల్లాలో 334 పంచాయతీలు, 2864 వార్డులకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేలా నోటిఫికేషన్ జారీ అయింది. జనవరి 21న మొదటి విడత పోలింగ్ నిర్వహిస్తుండగా జనవరి 25న రెండో విడత పోలింగ్, అదే విధంగా 3వ విడత పోలింగ్ జనవరి 30న నిర్వహించేందుకు ఎన్నికల సంఘం గజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 19 వరకు ఓటరు జాబితాలో ఓటు హక్కు కలిగి ఉన్నవారికి మాత్రమే పంచాయతీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకునేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహిస్తుండగా ఈసారి బ్యాలెట్ పత్రంలోనే నోటా గుర్తు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు ఫలితాలు వెలువడి కానున్నాయి. సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసే జనరల్ అభ్యర్థికి రూ.2వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.వెయ్యి డిపాసిట్ చేయాల్సి ఉంటుంది. వార్డు సభ్యులుగా పోటీచేసే వారు జనరల్ కేటాగిరిలో రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 250 డిపాసిట్ చేయాల్సి ఉంటుంది. ఈసారి 500 జనాభా దాటిన తాండాలు, గిరిజన గూడేల్లో సైతం పోలింగ్ నిర్వహించడంతో రాజకీయ కొలాహలం నెలకొంది.
పోలింగ్ జరిగే డివిజన్లు ఇవే..
తొలి విడతగా జనవరి 21న జరిగే పోలింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్ జారీ కాగా ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 30 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతగా ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో గల బోథ్ నియోజకవర్గంలోని 30 గ్రామపంచాయతీల్లో, మూడో విడతగా ఉట్నూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాలకు సంబంధించి 28 గ్రామపంచాయతీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అదే విధంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో సైతం మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించేలా నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 21 తొలివిడతగా జరిగే పోలింగ్ కోసం 7వ తేదీన షెడ్యూల్ జారీ కానుంది. 25న జరిగే పోలింగ్ కోసం 11న షెడ్యూల్ విడుదలకానుండగా 30న జరిగే మూడో విడత పోలింగ్ కోసం 16వ తేదీన షెడ్యూల్ జారీ చేయనున్నారు. తొలి విడత పోలింగ్‌కు జనవరి 7 నుండి నామినేషన్ల స్వీకరించనుండగా రెండోదశ 25న జరిగే పోలింగ్ కోసం జనవరి 11 నుండి నామినేషన్లు స్వీకరించనున్నారు. మూడో విడత 30న జరిగే పోలింగ్ కోసం 16 నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు.

ఆధునిక సాంకేతిక
పరిజ్ఞానంతో నేరాల అదుపు
* ఎస్పీ శశిధర్‌రాజు
నిర్మల్, జనవరి 1: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అదుపు చేస్తామని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో 2019 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కేక్‌కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గడిచిన సంవత్సరం పోలీసుశాఖలో ఎన్నో నూతన ఒరవడులు, ఆధునిక సాంకేతికతను అందించడమే కాకుండ సిబ్బంది పూర్తిస్థాయి కార్య నిబద్దతను ప్రదర్శించడానికి దోహదపడిందని తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో సహితం జిల్లా పోలీసులు అదేశైలీలో వారి వారి విధులను నిర్వర్తిస్తూ జిల్లాలో నేర శాతాన్ని నియంత్రించి ప్రజలకు మరింత చేరువ అవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నిర్మల్, భైంసా డీ ఎస్పీలు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌స్పెక్టర్, సీఐలు, ఎస్సైలు, క్యాంప్ సీసీ, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నూతన సంవత్సర శుభాకాంక్షలను ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళిధర్‌రెడ్డి, పాకాల రాంచందర్, ముత్యంరెడ్డి, వినోద్ మల్లికార్జున్ తెలిపారు. ఎస్పీ శశిధర్‌రాజును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా అయ్యప్ప
దేవాలయ వార్షికోత్సవం
ఉట్నూరు, జనవరి 1: స్థానిక మండల కేంద్రంలోని హరిహరసుత అయ్యప్ప స్వామి దేవాలయ 3వ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం అయ్యప్ప సేవా సమితి సభ్యులు, అయ్యప్ప భక్తులు ఘనంగా జరుపుకున్నారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గణపతి, మృత్యుంజయ హోమాలు, నవగ్రహ పూజలు, అయ్యప్పస్వామి మూలవిరాట్‌కు అభిషేకం, అష్టదిక్కుల శాంతి కార్యక్రమాలు చేపట్టారు. ఈకార్యక్రమాలు చెన్నూరుకు చెందిన వేద పం డితులు రజని అధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం భజన, అయ్యప్ప పడిపూజ, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి దీపక్‌దూబె, సేవా సమితి సభ్యులు కృష్ణస్వామి, సంజీవ్‌రెడ్డి, దయాకర్, తిరుపతి రెడ్డి, వీరాలాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.