అదిలాబాద్

ఏజెన్సీలో అవతరణ సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, జూన్ 2: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంబరానంటాయి. గురువారం వాడవాడల ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు జెండాలు ఎగరవేసి ఉత్సవాలు జరుపుకోగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతోపాటు కార్యాలయాల్లో సైతం సంబంధిత బాధ్యులు జాతీయ జెండాను ఎగరవేశారు. స్థానిక టిడిపి కార్యాలయంలో మాజీ ఎంపి రాథోడ్ రమేష్, బిజెపి అధ్వర్యంలో ఆ పార్టీ జాతీయ నాయకుడు గుగ్లావత్ శ్రీరాం నాయక్, టీఆర్‌ఎస్ పార్టీ అధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, లక్కారం పంచాయతీ కార్యాలయంలో, తహశీల్ కార్యాలయంలో సంబంధిత అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ మల్లారెడ్డి, సిఐ బిఎల్‌ఎన్ స్వామి, ఎస్సై మంగిలాల్, ఎడీవోకార్యాలయంలో ఎంపిడీవో లక్ష్మణ్, ఉట్నూరు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బొంత అశారెడ్డి, పలు పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు జాతీయ జెండాను ఎగరవేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తెలంగాణతల్లి విగ్రహంతోపాటు అమరవీరులస్థూపం వరకు ప్రభాతభేరి నిర్వహించారు. అనంతరం పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధు లు, నాయకులు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మిఠాయిలు పంచిపెట్టి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో పలువురు అధికారులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.