అదిలాబాద్

అనుమానాస్పదంగా వార్డు సభ్యుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్నారం, జూన్ 10: మండల కేంద్రంలోని పొన్కల్ పంచాయతీకి చెందిన రెండవ వార్డు సభ్యుడు రంగు రమేష్ (40) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ మేరకు ఎస్సై లింగమూర్తి కథనం మేరకు మృతుడు రమేష్ గురువారం ఓ ప్రజాప్రతినిధి ఇచ్చిన విందుకు హాజరై రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాడని, మద్యంమత్తులో మంచంపై నుండి కిందపడడంతో భార్య శుభమణి లక్సెటిపేట ఆసుపత్రికి తరలించిందని,చికిత్స పొందుతూ మృతి చెందాడని అన్నారు. కాగా మృతుడి సోదరుడు రంగు నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.