అదిలాబాద్

మొక్కలను బాధ్యతగా సంరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, జూలై 21: మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఎమ్మెల్యే రేఖానాయక్ పేర్కొన్నారు. గురువారం ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం, వాటిని సంరక్షించుకోవడం వల్లనే ముఖ్యమంత్రి కెసి ఆర్ ఆశయం నెరవేరుతుందని, దానికై మొక్కలు నాటిన ప్రతి ఒక్కరు సంరక్షించుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. హరితహారంలో తెలంగాణ రాష్టమ్రంతా సస్యశామలంగా మారుతుందన్న ముఖ్యమంత్రి లక్ష్యం పెట్టుకున్నారని, ఆ లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావడం అభినందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జగజీవన్, ఎంపిపి విమల రాథోడ్‌తో పాటు పలువురు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.