అదిలాబాద్

మిషన్ కాకతీయ పనులను పరిశీలించిన ఓఎస్‌డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్చోడ, ఆగస్టు 28: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయలో భాగంగా పునర్నిర్మాణం చేపట్టిన ఎల్లమ్మకుంట చెరువును ఆదివారం నీటి పారుదల శాఖ ఓ ఎస్‌డి శ్రీదర్ దేశ్‌పాండేతో పాటు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరిశీలించారు. ఈ చెరువు కింద ఉన్న ఆయకట్టు వివరాలతో పాటు చెరువు పునర్నిర్మాణానికి నిధుల చెల్లింపు వివరాలు నీటి పారుదల శాఖ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. మిషన్ కాకతీయ పథకం రాష్ట్రంలో సత్ఫలితాలను ఇస్తుందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రత్యేక దృష్టిని పెట్టారని ఓ ఎస్‌డి అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులతో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.