అదిలాబాద్

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఏడేళ్ల జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 22: కాసిపేట మండలంలోని ఓ గ్రామంలో గత ఏడాది నాలుగేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిపిన కేసులో నిందితునికి ఏడేళ్ళ జైలుశిక్ష, రూ.15వేల జరిమాన విధిస్తూ జిల్లా అదనపు న్యాయమూర్తి కుంచాల సునీత గురువారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం కాసిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన నాలుగేళ్ల మైనర్ బాలికను తూర్పు గోదావరి జిల్లా పెదపట్నంకు చెందిన ముషిని బాలసుబ్రహ్మణ్యం జీవనోపాధి నిమిత్తం పెయింటర్‌గా పనిచేస్తూ ఇక్కడే ఉంటున్నాడు. కాగా, మైనర్ బాలికను చాక్‌లెట్ కొనిస్తానని తీసుకువెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు రేప్ కేసు నమోదు చేసి బెల్లంపల్లి డిఎస్పీ రమణారెడ్డి అధ్వర్యంలో కేసు దర్యాప్తు జరిపి నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా అదనపు పిపి ముస్కు రమణారెడ్డి 14 మంది సాక్షులను విచారించిన పిమ్మట నేరం రుజువు కావడంతో నిందితునికి ఏడేళ్ల కారగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.