అదిలాబాద్
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని సిఎం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కడెం, సెప్టెంబర్ 26: ఎన్నికల సమయంలో కె.చంద్రశేఖర్రావు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎంపి రాథోడ్ రమేష్ ఆరోపించారు. సోమవారం హరిత రిసార్ట్లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని కెసిఆర్ అవినీతిమయంగా మార్చారని ఆరోపించారు. మ్యానిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు అందించలేకపోయారన్నారు. యువత ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయడంతో విఫలమైందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు మంజూరుచేయకపోవడంతో విద్యార్థుల అవస్థలు అంతా ఇంతకాదన్నారు. మిషన్ భగీరథ పేరుతో అధికారపార్టీ నేతలు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కోట్లు దోచుకుంటున్నారన్నారు. అనంతరం మండలంలోని మల్లాపూర్, రేవోజిపేట్, మున్యాల్, కొత్తపెద్దూర్, గొడిసిర్యాల, దస్తురాబాద్, బూత్కూర్, అంబారిపేట్ గ్రామాల్లో రమేష్ సుడిగాలి పర్యటన చేశారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి ఓల శ్రీనివాస్, పురపాటి శ్రీనివాస్రెడ్డి, కె.శంకరయ్య, నాయకులు జీవన్నాయక్, రాజు, దీటి సత్యం, గాదె శ్రీ్ధర్, రాజేష్, రాజమల్లు, దేవరాజు, నరేందర్, తులసీరాం తదితరులు పాల్గొన్నారు.