జాతీయ వార్తలు

వాజ్‌పేరుూ ఆరోగ్యంపై హెల్త్‌బులెటన్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని వాజ్‌పేరుూ ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు హెల్త్‌బులెటన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం మరింత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా వాజ్‌పేరుూ ఆరోగ్యం మరింత క్షీణించటంతో బీజేపీ అగ్రనేతలు వచ్చి ఆయనను పరామర్శిస్తున్నారు. ప్రధాని మోదీ నిన్న ఆయనను పరామర్శించారు. మళ్లీ ఈ రోజు కూడా ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉంది. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్టప్రతి వెంకయ్య, బీజేపీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ, ఆయన కుమార్తె పూర్ణిమా అద్వానీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, దత్తపుత్రిక నమిత, పలువురు కేంద్ర మంత్రులు ఆసుపత్రికి వచ్చి వాజ్‌పీరుూని పరామర్శించారు.