జాతీయ వార్తలు
రాజ్యాంగస్ఫూర్తితో విధులు నిర్వహించాలి: అమిత్షా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 24 August 2019
హైదరాబాద్: ఐపీఎస్లు దేశాభివృద్ధికి పాటుపడాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పేర్కొన్నారు. ఆయన 70వ బ్యాచ్కు చెందిన 92మంది పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా అందరితో సమన్వయం చేసుకుంటూ సత్ఫలితాలను సాధించాలని అన్నారు. రాజ్యాంగస్ఫూర్తి దెబ్బతినకుండా ధైర్యంగా విధులు నిర్వహించాలని అమిత్షా ఐపీఎస్ అధికారులకు సూచించారు. స్వదేశీ సంస్థాల విలీనం కోసం పటేల్ చేసిన కృషి ఎంతో ఉందని, జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో పటేల్ ఆశయం పూర్తిగా నెరవేరిందని అన్నారు.